Hyderabad: సీఎం రేవంత్ తో భేటీ అయిన హైదరాబాద్ మేయర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.
- By Praveen Aluthuru Published Date - 03:17 PM, Sat - 3 February 24
Hyderabad: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. సీఎం నివాసం జూబ్లీహిల్స్ లో జరిగిన ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి జీహెచ్ ఎంసీ (GHMC) జనరల్ బాడీ కౌన్సిల్ సమావేశమవుతుంది. మేయర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లు తమ సమస్యలను లేవనెత్తుతారు. అయితే చివరి జనరల్ బాడీ సమావేశం ఆగస్టులో నిర్వహించగా, నవంబర్లో నిర్వహించాల్సి ఉంది. ఆ సమయంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉన్నందున కౌన్సిల్ సమావేశం జరగలేదు.
శుక్రవారం బీఆర్ఎస్కు చెందిన ఒకరితో పాటు బీజేపీ కార్పొరేటర్లు సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాప్యానికి బీజేపీ కార్పొరేటర్లు శ్రావణ్ వూరపల్లి, ఆకుల శ్రీవాణిలు కారణమని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆమె ఈ రోజు శనివారం సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి.
GHMC Mayor Gadwala Vijayalakshmi met Chief Minister Shri Revanth Reddy at his Jubilee Hills residence.@revanth_anumula @GadwalvijayaTRS pic.twitter.com/qAStUrUXZL
— Congress for Telangana (@Congress4TS) February 3, 2024
Also Read: TTD: హిందూ ధర్మప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి: టీటీడీ చైర్మన్ భూమన
Related News
KTR Comments: బీజేపీ కనుసన్నల్లో ఈసీ నడుస్తోంది.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్పై ఈసీ 48 గంటలు నిషేధం విధించిన క్రమంలో కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు.