HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Do You Know Why Cm Revanth Reddy Thanked Owaisi

Telengana : ఒవైసీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఎందుకో తెలుసా?

ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం సహజమేనని, వారి న్యాయ అనుభవం, ప్రజాసేవ దృష్ట్యా తన పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని స్పష్టం చేశారు.

  • Author : Latha Suma Date : 07-09-2025 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Do you know why CM Revanth Reddy thanked Owaisi?
Do you know why CM Revanth Reddy thanked Owaisi?

Telengana : ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఆకస్మికంగా ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి. ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడంతో కొత్త రాజకీయ ఊహాగానాలకు తావిచ్చింది. ఆదివారం ఓ ప్రకటనలో ఒవైసీ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి చేసిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హైదరాబాదీ అయిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వడం సహజమేనని, వారి న్యాయ అనుభవం, ప్రజాసేవ దృష్ట్యా తన పార్టీ ఈ నిర్ణయాన్ని తీసుకుందని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆయనతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి శుభాకాంక్షలు కూడా తెలియజేశానని ఒవైసీ వెల్లడించారు.

Read Also: BRS : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ జోరు..రాష్ట్ర పర్యటనలకు సిద్ధమవుతున్న కేటీఆర్

ఈ పరిణామంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు తెలిపిన అసదుద్దీన్ ఒవైసీకి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ ఇండియా కూటమిలో భాగస్వామి కానప్పటికీ, ఒవైసీ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే, జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో, “తెలుగు ఆత్మగౌరవం” నినాదంతో ఆయనకు మద్దతు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. అయితే తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికీ తమ స్థానం ప్రకటించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో రాష్ట్రానికి యూరియా కొరతను తీర్చే హామీ ఇచ్చినవారికే మద్దతు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి రాజ్యసభలో బీఆర్ఎస్‌కు నలుగురు సభ్యులు ఉన్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాజకీయ సన్నివేశం భిన్నంగా సాగుతోంది. ఎన్డీయే కూటమిలో భాగమైన అధికార టీడీపీ, జనసేనలు తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ప్రకటించాయి. మరోవైపు, ఏ కూటమిలోనూ లేని వైఎస్‌ఆర్‌సీపీ కూడా ఎన్డీయే అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో, మద్యం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఓటు హక్కు వినియోగించుకునేందుకు శనివారం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుండగా, తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల వైఖరులు విభిన్నంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో స్థిరపడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి వస్తున్న మద్దతులతో పాటు, సీఎం రేవంత్ రెడ్డి ఈ అభ్యర్థిత్వాన్ని “తెలుగు ప్రజల గౌరవానికి” ప్రతీకగా మలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎంఐఎం మద్దతు ఈ ప్రచారానికి బలం చేకూర్చనుంది.

Read Also: Tamil Nadu : తమిళనాడులో అమానుష ఘటన..భూవివాదంతో మహిళను చెట్టుకు కట్టేసి దాడి

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIMIM support
  • asaduddin owaisi
  • brs
  • INDIA alliance
  • Justice Sudarshan Reddy
  • ktr
  • revanth reddy
  • telangana politics
  • Vice President Election

Related News

KTR Welcomed With YSRCP Flags

కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు..

KTR khammam Tour ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆయన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోలు, వైసీపీ జెండాలు కనిపించడం ఆసక్తికరంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న క కార్యకర్తలు ‘జై జగన్.. జై కేటీఆర్’ అంటూ నినాదాలు చేశారు. ఇటీవల జగన్ పుట్టినరోజు వేడుకల్లో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడంతో రెండు

  • Kavithavsbrs

    కవిత కు బిఆర్ఎస్ కు ఎక్కడ చెడింది?

  • kcr rule

    కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!

  • Kavitha Crying

    కవిత కన్నీరు, బిఆర్ఎస్ ను మరింత పతనం చేయబోతుందా ?

  • MLC Kavitha Emotional in Legislative Council

    శాసన మండలిలో కన్నీరు పెట్టిన కవిత

Latest News

  • శంకర వరప్రసాద్ ఆల్రెడీ సూపర్ హిట్..నెక్స్ట్ వెంకటేశ్‌తో ఫుల్‌లెంగ్త్‌ మూవీ: చిరంజీవి

  • సింగపూర్ సైన్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ మనవడు

  • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

  • అమెరికా కు భారీ ఆఫర్ ఇచ్చిన పాక్, ఉద్దేశ్యం అదేనా ?

  • అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

Trending News

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

    • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd