HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Cm Revanth Entered The Field Lunch With The Students

CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్‌.. విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం!

పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

  • By Gopichand Published Date - 10:07 AM, Sat - 14 December 24
  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెనూ ప్రారంభం కానుంది. పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ చార్జీలను ఒక్కసారిగా 40 శాతం పెంచింది. కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచింది. పెంచిన చార్జీల ప్రకారం మెనూలో మార్పులు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి నేడు మధ్యాహ్నం కొత్త మెనూ ప్రకారం భోజనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యావత్ క్యాబినెట్ నిర్ణయించింది.

ఈ సందర్భంగా మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయనున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్స్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందుబాటులోకి రానుంది. చార్జీలు పెంచిన అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా నేడు విద్యార్థులతో యావత్ రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి భోజనం చేయనుంది.

Also Read: Earthqauke: మ‌య‌న్మార్‌లో మ‌రోసారి భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం!

పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెస్ చార్జీలు పెంచాలంటూ గత పది ఏళ్లపాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఎన్ని ఆందోళనలు నిర్వహించిన ఆనాటి బీఆర్ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఉన్నతాధికారులతో కమిటీ వేసి 15 రోజుల్లోనే నివేదిక తెప్పించుకొని చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోషకాహారంతో పాటు, రుచికరమైన భోజనం అందించేందుకు మెనూ ఏ రకంగా ఉండాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులు, నిపుణులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి మెనూ ఖరారు చేశారు. పెంచిన మెస్, కాస్మోటిక్స్ చార్జీలతో రాష్ట్ర ప్రభుత్వంపై రెండు సంవత్సరాలకు రూ. 470 కోట్ల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతోంది. సంక్షేమ విద్యార్థుల చార్జీలు పెంచడమే కాదు, వారి మెనూ ఎలా ఉండాలి అనే అంశంపై లోతుగా చర్చించడం, పలుమార్లు సమావేశాలు నిర్వహించడం, వివిధ అంశాలను పరిశీలించడం ఆ వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Lunch With Students
  • CM Revanth Reddy
  • congress
  • Deputy CM Bhatti
  • hyderabad
  • schools
  • telangana news
  • telugu news

Related News

Balapur Ganesh

Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

Ganesh Visarjan : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ప్రత్యేకతను చాటే బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ముగిసిన వెంటనే గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే శోభాయాత్రను ప్రారంభించారు.

  • Balapur Ganesh Laddu sets record price..how many lakhs this time..?

    Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • Ganesh Nimajjanam Tank Bund

    Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

Latest News

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd