HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Entered The Field Lunch With The Students

CM Revanth: రంగంలోకి దిగిన సీఎం రేవంత్‌.. విద్యార్థుల‌తో క‌లిసి భోజ‌నం!

పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

  • By Gopichand Published Date - 10:07 AM, Sat - 14 December 24
  • daily-hunt
CM Revanth
CM Revanth

CM Revanth: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో నేడు కొత్త మెనూ ప్రారంభం కానుంది. పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం డైట్ చార్జీలను ఒక్కసారిగా 40 శాతం పెంచింది. కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచింది. పెంచిన చార్జీల ప్రకారం మెనూలో మార్పులు చేపట్టారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి నేడు మధ్యాహ్నం కొత్త మెనూ ప్రకారం భోజనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు యావత్ క్యాబినెట్ నిర్ణయించింది.

ఈ సందర్భంగా మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయనున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వసతి గృహాల విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం డైట్, కాస్మోటిక్స్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఎనిమిది లక్షల మంది విద్యార్థులకు పోషకాహారంతో పాటు రుచికరమైన భోజనం అందుబాటులోకి రానుంది. చార్జీలు పెంచిన అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా నేడు విద్యార్థులతో యావత్ రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి భోజనం చేయనుంది.

Also Read: Earthqauke: మ‌య‌న్మార్‌లో మ‌రోసారి భూకంపం.. ప‌రుగులు తీసిన జ‌నం!

పెంచిన చార్జీలు, మారిన మెనూ వివరాలను ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటుచేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. 10 సంవత్సరాలుగా మెస్, 16 సంవత్సరాలుగా కాస్మోటిక్స్ చార్జీలలో పెరుగుదల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మెస్ చార్జీలు పెంచాలంటూ గత పది ఏళ్లపాటు విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఎన్ని ఆందోళనలు నిర్వహించిన ఆనాటి బీఆర్ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఉన్నతాధికారులతో కమిటీ వేసి 15 రోజుల్లోనే నివేదిక తెప్పించుకొని చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోషకాహారంతో పాటు, రుచికరమైన భోజనం అందించేందుకు మెనూ ఏ రకంగా ఉండాలనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులు, నిపుణులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి మెనూ ఖరారు చేశారు. పెంచిన మెస్, కాస్మోటిక్స్ చార్జీలతో రాష్ట్ర ప్రభుత్వంపై రెండు సంవత్సరాలకు రూ. 470 కోట్ల అదనపు భారం పడనుంది. అయినప్పటికీ విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుపోతోంది. సంక్షేమ విద్యార్థుల చార్జీలు పెంచడమే కాదు, వారి మెనూ ఎలా ఉండాలి అనే అంశంపై లోతుగా చర్చించడం, పలుమార్లు సమావేశాలు నిర్వహించడం, వివిధ అంశాలను పరిశీలించడం ఆ వర్గాలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టం చేస్తుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Lunch With Students
  • CM Revanth Reddy
  • congress
  • Deputy CM Bhatti
  • hyderabad
  • schools
  • telangana news
  • telugu news

Related News

Messi

Messi: హైద‌రాబాద్‌కు లియోనెల్ మెస్సీ.. ఎప్పుడంటే?!

మెస్సీ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ భారతదేశంలో తన పర్యటన వివరాలను తెలియజేశారు. మెస్సీ పోస్ట్‌లో ఇలా రాశారు.

  • Telangana Global Summit To

    Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్

  • Gold & Silver Rate

    Gold & Silver Rate Today : భారీగా పెరిగిన వెండి ధర.. తగ్గిన గోల్డ్ రేటు

  • Review Meetings Kick Off Fo

    Telangana Global Summit : చరిత్ర సృష్టించబోతున్న హైదరాబాద్

  • Telangana Global Summit To

    Telangana Global Summit : పెట్టుబడులకు కేరాఫ్‌గా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ – సీఎం రేవంత్

Latest News

  • Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ప్ర‌స్థానం ఇదే.. క్రికెటర్ నుండి ప్రధానిగా, ఆపై జైలుకు ఎలా చేరారు?

  • Health Tips: భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర వ‌స్తుందా? అయితే ఇలా చేయండి!

  • Lord Ram Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

  • India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

  • Rear View Mirror: బైక్ రియర్ వ్యూ మిర్రర్ ఎలా సెట్ చేయాలి?

Trending News

    • Rules Change: డిసెంబ‌ర్ నెల‌లో మార‌నున్న రూల్స్ ఇవే!

    • Trump: దక్షిణాఫ్రికాపై డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం!

    • Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత అరెస్ట్..స్టేషన్‌కు తరలించిన పోలీసులు..!

    • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

    • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd