Telangana: నామినేషన్ పత్రాలను సమర్పించిన ఎమ్మెల్యే రాజా సింగ్
బిజెపి నాయకుడు, గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారం అబిడ్స్లోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.
- Author : Praveen Aluthuru
Date : 04-11-2023 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana: బిజెపి నాయకుడు, గోషామహల్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ శనివారం అబిడ్స్లోని మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయన వెంట ఉన్నారు. రాజా సింగ్ తన నామినేషన్ దాఖలు చేయడానికి భారీ ర్యాలీతో అబిడ్స్ లోని మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. అయితే అబిడ్స్ పోలీసులు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నలుగురిని మాత్రమే తన నామినేషన్ ప్రక్రియను నిర్వహించడానికి అనుమతించారు.
గోషామహల్ అసెంబ్లీలో కమలం వికసించడం ఖాయమని స్పేస్యం చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. పార్టీ అభ్యర్థి రాజా సింగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారని ఆయన చెప్పారు. స్వతంత్ర పోరాటంలో ముందుగా బ్రిటీష్, ఆ తర్వాత నిజాంల నుంచి, ఇప్పుడు అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ కుటుంబాన్ని, మరియు కాంగ్రెస్ను తిరస్కరించి తెలంగాణ అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని ఆయన చెప్పారు. .నామినేషన్ కార్యక్రమానికి ముందు రాజా సింగ్ మరియు అనురాగ్ ఠాకూర్ మంగళ్హాట్లోని ఆకాశపురి హనుమాన్ ఆలయంలో ప్రార్థనలు చేశారు.
గత ఆగస్టులో మహ్మద్ ప్రవక్తపై రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగా రాజా సింగ్ను బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే, రాష్ట్ర ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు బిజెపి కేంద్ర క్రమశిక్షణా కమిటీ అతని సస్పెన్షన్ను ఎత్తివేసింది. కాగా.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది.
Also Read: Hyderabad: జూబ్లీహిల్స్ లో భారీగా పట్టుబడ్డ హ్యాష్ ఆయిల్