Saudi Arabia Cricket League: సౌదీ అరేబియా ఐపీఎల్ కంటే పెద్ద క్రికెట్ లీగ్ని ప్రారంభిస్తుందా? క్లారిటీ ఇదే!
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ వార్తలను తోసిపుచ్చింది. సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) అధ్యక్షుడు హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ ఈ వార్తలను ఖండించారు.
- By Gopichand Published Date - 05:48 PM, Tue - 26 November 24
Saudi Arabia Cricket League: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ తన ఆటతీరును విస్తరించింది. ఈ గేమ్ ఇప్పుడు దాదాపు ప్రతి చిన్న, పెద్ద దేశంలో కనిపిస్తుంది. ఇటీవల సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఐపీఎల్ వేలం జరిగింది. ఇందులో చాలా మంది ఆటగాళ్ళపై వేలం జరిగింది. సౌదీ అరేబియాలో ఐపీఎల్ కంటే పెద్దదైన క్రికెట్ లీగ్ని సౌదీ అరేబియా నిర్వహించబోతోందని గతేడాది ఒక వార్త హెడ్లైన్స్లో వచ్చింది. దీనిపై ఇప్పుడు సౌదీ అరబ్ క్రికెట్ ఫెడరేషన్ (Saudi Arabia Cricket League) అధ్యక్షుడు హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ స్వయంగా ఒక పెద్ద అప్డేట్ను పంచుకున్నారు.
సౌదీ అరేబియా షేర్ చేసిన పెద్ద అప్డేట్ ఇదే!
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన క్రికెట్ లీగ్ వార్తలను తోసిపుచ్చింది. సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ (SACF) అధ్యక్షుడు హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ ఈ వార్తలను ఖండించారు. సౌదీ అరేబియా ఎలాంటి క్రికెట్ లీగ్ను ప్రారంభించటంలేదని ఆయన తెలిపారు.
Also Read: Australia Squad: టీమిండియాకు భయపడి ముందే జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా!
ఐపీఎల్ మెగా వేలం 2024 సందర్భంగా సౌదీ అరేబియా యువరాజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ లీగ్ వార్తల్లో వాస్తవం లేదన్నారు. అయితే భవిష్యత్తులో ఐపీఎల్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వడంలో తమ దేశ పాత్రపై కూడా స్పష్టత ఇచ్చాడు. BCCI, SACF.. సౌదీ ప్రభుత్వం దీనిపై చర్చిస్తామని ప్రిన్స్ అంగీకరించారు.
జెడ్డాలో కొత్త స్టేడియం నిర్మించనున్నారు
ఎడారిలో క్రికెట్ పెద్ద ఎత్తున ప్రారంభమవుతుందని, త్వరలో జెడ్డాలో గొప్ప స్టేడియంను సిద్ధం చేస్తామని సౌదీ యువరాజు చెప్పారు. ఐపీఎల్ వేలం తొలి అడుగు అని, ఈ సమయంలో అతను జై షాకు కృతజ్ఞతలు తెలిపాడు. షా.. సౌదీ ప్రభుత్వం లేకుండా IPL వేలం నిర్వహించడం సాధ్యం కాదని అంగీకరించాడు. సౌదీ అరేబియాలో మొదటిసారి ఐపిఎల్ వేలం నిర్వహించబడిందని మనకు తెలిసిందే. గతంలో ఐపీఎల్ వేలం యూఏఈలో జరిగింది. అయితే సౌదీ తొలిసారిగా ఐపీఎల్, బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్ వేలం నిర్వహించింది.