విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల తర్వాత రోహిత్!
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్గా, ఆయుష్ బదోని వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉంటారని సమాచారం. ఢిల్లీ జట్టు గ్రూప్-డి లో ఉంది.
- Author : Gopichand
Date : 22-12-2025 - 6:14 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit- Virat: బీసీసీఐ నిర్వహించే ప్రతిష్టాత్మక దేశీవాళీ వన్డే టోర్నమెంట్ ‘విజయ్ హజారే ట్రోఫీ’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి ప్రధాన కారణం టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చాలా కాలం తర్వాత ఈ టోర్నీలో ఆడబోతుండటమే. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2010లో (తన కెరీర్ ఆరంభంలో) ఈ టోర్నీ ఆడారు. అంటే దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. అలాగే రోహిత్ శర్మ కూడా 7 ఏళ్ల తర్వాత ఈ దేశీవాళీ టోర్నీ ఆడనున్నారు. వీరిద్దరూ ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుండి రిటైర్ కావడంతో ప్రస్తుతం వన్డేలపైనే దృష్టి సారించారు. జనవరిలో న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్కు ముందు ఈ టోర్నీ వారికి మంచి ప్రాక్టీస్గా మారనుంది.
విరాట్ కోహ్లీ ఎప్పుడు ఆడతారు? (ఢిల్లీ జట్టు షెడ్యూల్)
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్గా, ఆయుష్ బదోని వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు. విరాట్ కోహ్లీ మొదటి రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉంటారని సమాచారం. ఢిల్లీ జట్టు గ్రూప్-డి లో ఉంది.
Also Read: 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్లు!
ఢిల్లీ జట్టు మ్యాచ్ల షెడ్యూల్
- 24 డిసెంబర్, 2025: వర్సెస్ ఆంధ్రప్రదేశ్ (బెంగళూరు)
- 26 డిసెంబర్, 2025: వర్సెస్ గుజరాత్ (బెంగళూరు)
- 29 డిసెంబర్, 2025: వర్సెస్ సౌరాష్ట్ర (అలూర్)
- 31 డిసెంబర్, 2025: వర్సెస్ ఒడిశా (అలూర్)
- 3 జనవరి, 2026: వర్సెస్ సర్వీసెస్ (బెంగళూరు)
- 6 జనవరి, 2026: వర్సెస్ రైల్వేస్ (అలూర్)
- 8 జనవరి, 2026: వర్సెస్ హర్యానా (బెంగళూరు)
రోహిత్ శర్మ కూడా మొదటి 2 మ్యాచ్లే.. (ముంబై షెడ్యూల్)
ముంబై జట్టు గ్రూప్-సి లో ఉంది. నివేదికల ప్రకారం.. రోహిత్ శర్మ కూడా గ్రూప్ దశలో మొదటి రెండు మ్యాచ్లలో మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. ముంబై జట్టు మ్యాచ్లు జైపూర్లో జరగనున్నాయి.
ముంబై జట్టు గ్రూప్ స్టేజ్ షెడ్యూల్
- 24 డిసెంబర్, 2025: వర్సెస్ సిక్కిం (జైపూర్)
- 26 డిసెంబర్, 2025: వర్సెస్ ఉత్తరాఖండ్ (జైపూర్)
- 29 డిసెంబర్, 2025: వర్సెస్ ఛత్తీస్గఢ్ (జైపూర్)
- 31 డిసెంబర్, 2025: వర్సెస్ గోవా (జైపూర్)
- 3 జనవరి, 2026: వర్సెస్ మహారాష్ట్ర (జైపూర్)
- 6 జనవరి, 2026: వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ (జైపూర్)
- 8 జనవరి, 2026: వర్సెస్ పంజాబ్ (జైపూర్)