IND vs NZ ODI: క్లీన్స్వీప్కు వేళాయే.. ఇండోర్ వేదికగా నేడు మూడో వన్డే
కివీస్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. నేడు నామమాత్రమైన ఆఖరు వన్డే ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కూడా నెగ్గి కివీస్ (IND vs NZ ODI)ను వైట్ వాష్ చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంటే.. ఇందులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ యోచిస్తుంది.
- By Gopichand Published Date - 09:05 AM, Tue - 24 January 23
కివీస్తో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది. నేడు నామమాత్రమైన ఆఖరు వన్డే ఇండోర్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కూడా నెగ్గి కివీస్ (IND vs NZ ODI)ను వైట్ వాష్ చేయాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతుంటే.. ఇందులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ యోచిస్తుంది.
భారత్, న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్లో మూడో, చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్లో భారత్ నిర్ణయాత్మక ఆధిక్యం సాధించింది. హైదరాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. రాయ్పూర్లో జరిగిన రెండో మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో కివీస్పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1 గంటలకు టాస్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్లను ప్రసారం చేసే హక్కులను కలిగి ఉంది. మీరు స్టార్ స్పోర్ట్స్లోని వివిధ ఛానెల్లలో హిందీ, ఇంగ్లీష్ కాకుండా దేశంలోని ఇతర భాషలలో వ్యాఖ్యానంతో ఈ మ్యాచ్ని చూడవచ్చు.
Also Read: KL Rahul- Athiya Wedding: ఘనంగా టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి
ఇప్పుడు మూడో మ్యాచ్లో రోహిత్ శర్మ & కో 3-0తో కివీస్ ని వైట్ వాష్ చేయాలనుకుంటుంది. మరోవైపు న్యూజిలాండ్ చివరి మ్యాచ్లో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. భారత గడ్డపై వన్డే సిరీస్ గెలవాలన్న న్యూజిలాండ్ కల అసంపూర్తిగా మిగిలిపోయింది. కివీస్ జట్టు గత 34 ఏళ్లుగా భారత గడ్డపై వన్డే సిరీస్ను గెలవలేకపోయింది. న్యూజిలాండ్ జట్టు 1988-89 నుంచి క్రమం తప్పకుండా వన్డే సిరీస్లు ఆడేందుకు భారత్కు వస్తోంది. అయితే ఈ సమయంలో భారత్లో వన్డే సిరీస్లో కివీస్ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుత సిరీస్లో చూస్తే హైదరాబాద్, రాయ్పూర్లలో భారత్, కివీస్ ను ఓడించి తిరుగులేని ఆధిక్యం సాధించింది.
Related News
T20 World Cup 2024: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. టీ20 ప్రపంచ కప్ నుంచి అవుట్
పీఎల్ తర్వాత విదేశీ గడ్డపై టీ20 ప్రపంచకప్ మహా సంగ్రామం జరగనుంది. ఈ టోర్నీకి టీమిండియా జట్టును ఈ నెల చివరి తేదీలలో ప్రకటించనున్నారు. అంతకంటే ముందే 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును క్రికెట్ నిపుణులు ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ బ్యాట్స్మెన్ సంజయ్ మంజ్రేకర్ టీ20 ప్రపంచకప్కు భారత జట్టును ఎంపిక చేశారు.