Kohli Sparks: ఎన్నాళ్ళకెన్నా ళ్లకు…. ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
- By Naresh Kumar Published Date - 06:54 PM, Sat - 30 April 22
ఐపీఎల్ 15వ సీజన్ లో భాగంగా ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. బెంగళూరు జట్టులో విరాట్ కోహ్లి 53 బంతుల్లో6 ఫోర్లు, సిక్స్ సాయంతో 58 పరుగులు , రజత్ పటిదార్ 32 బంతుల్లో 52; 5 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 52 పరుగులు చేసి అర్ధ సెంచరీలతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో ప్రదీప్ సాంగ్వాన్ 2 , షమీ, జోసఫ్, ఫెర్గుసన్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.
అయితే ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. 15 ఐపీఎల్ ఇన్నింగ్స్ల తర్వాత విరాట్ కోహ్లీకి ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఓ ఫ్రాంచైజీ తరఫున అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఇక చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడంతో సహచర ఆటగాళ్లతో పాటుగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే. ఈ మ్యాచ్ ద్వారా ఆర్సీబీ జట్టు ఓ చెత్త రికార్డును కూడా సాధించింది. ఈ సీజన్లో ఒక జట్టు తరపున టాప్-3 బ్యాట్స్మెన్ ఎక్కువసార్లు డకౌట్ అయిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ టాప్-3 బ్యాట్స్మెన్లు ఆరుసార్లు డకౌట్ గా పెవిలియన్ చేరారు. వీరిలోయువ ఆటగాడు అనూజ్ రావత్ మూడుసార్లు డకౌట్ అవగా.. విరాట్ కోహ్లి రెండుసార్లు, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఒకసారి డకౌట్ అయ్యారు.
Virat Kohli half century today. pic.twitter.com/d24tXYH5Au
— Shivam Thakur (@ShivamT95251517) April 30, 2022
Related News
Dhoni Bowling: ఆర్సీబీతో మ్యాచ్ లో ధోనీ బౌలింగ్..
ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది. లీగ్ దశలు ముగుస్తున్న తరుణంలో రేపు శనివారం మరో కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, ఆతిథ్య రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పైనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇక ఆర్సీబీని ఎదుర్కొనేందుకు ధోనీ కొత్త బాధ్యత తీసుకోవాలని నిర్ణ