Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్షిప్ లేకుండానే బరిలోకి!
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మహా సంగ్రామం జరుగుతుంది.
- Author : Gopichand
Date : 06-09-2025 - 8:27 IST
Published By : Hashtagu Telugu Desk
Team India Jersey: ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు దుబాయ్ బయలుదేరింది. అంతకు ముందు బీసీసీఐ- డ్రీమ్ 11 మధ్య జెర్సీ (Team India Jersey) స్పాన్సర్షిప్ డీల్ ముగిసింది. దీంతో బీసీసీఐ కొత్త స్పాన్సర్షిప్ కోసం టెండర్ కూడా జారీ చేసింది. ఆసియా కప్లో టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్షిప్ లేకుండా బరిలోకి దిగుతుంది. డ్రీమ్ 11తో ఒప్పందం ముగిసిన తర్వాత టీమ్ ఇండియా కొత్త జెర్సీ మొదటి లుక్ బయటకు వచ్చింది. టీమ్ ఇండియా కొత్త జెర్సీని ఒకసారి చూద్దాం.
టీమ్ ఇండియా కొత్త జెర్సీ ఎలా ఉంది?
ఆసియా కప్ 2025కు ముందు భారత జట్టు కొత్త జెర్సీ మొదటి లుక్ బయటకు వచ్చింది. కొత్త జెర్సీలో టీ-షర్ట్పై ఎలాంటి స్పాన్సర్ పేరు లేదు. జెర్సీ ఎడమ వైపున బీసీసీఐ లోగో ఉండగా, కుడి వైపున డీపీ వరల్డ్ ఆసియా కప్ 2025 అని రాసి ఉంది. డీపీ వరల్డ్ ఆసియా కప్ 2025 స్పాన్సర్. దీనితో పాటు జెర్సీపై కేవలం ఇండియా పేరు మాత్రమే రాసి ఉంది. ఆసియా కప్లో భారత జట్టుకు జెర్సీ స్పాన్సర్ ఉండదని భావించారు. ఈ వార్త ఇప్పుడు నిజమైంది.
🚨 THE ASIA CUP JERSEY OF TEAM INDIA 🚨 🇮🇳 pic.twitter.com/UVuIHEu5C9
— Johns. (@CricCrazyJohns) September 6, 2025
Also Read: Lunar Eclipse: రేపే చంద్రగ్రహణం.. ఏ దేశాలపై ప్రభావం అంటే?
డ్రీమ్ 11, బీసీసీఐ మధ్య ఒప్పందం రద్దు
డ్రీమ్ 11, బీసీసీఐ మధ్య ఒప్పందం ముగిసింది. 2023లో డ్రీమ్ 11 టీమ్ ఇండియాకు జెర్సీ స్పాన్సర్గా మారింది. ఈ ఒప్పందం 3 సంవత్సరాల కోసం కుదిరింది. కానీ గడువుకు 6 నెలల ముందుగానే ఈ ఒప్పందం రద్దైంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆగస్టులో ఆన్లైన్ గేమింగ్ సవరణ 2025లో పెద్ద మార్పు తీసుకొచ్చి, డబ్బు లావాదేవీలు నిర్వహించే యాప్లను నిషేధించింది. దీని తర్వాత డ్రీమ్ 11కు భారీ షాక్ తగిలింది. ఇప్పుడు బీసీసీఐ కొత్త జెర్సీ స్పాన్సర్షిప్ కోసం చూస్తోంది.
సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం
ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. భారత జట్టు తమ మొదటి మ్యాచ్ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 14న భారత్, పాకిస్తాన్ మధ్య మహా సంగ్రామం జరుగుతుంది. సెప్టెంబర్ 19న టీమ్ ఇండియా ఒమన్తో తలపడుతుంది.