world cup 2023: ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో షమీ అవుట్?
ప్రపంచకప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన తదుపరి మ్యాచ్ ని ఇంగ్లాండ్ తో ఆడనుంది. లక్నో వేదికగా ఆదివారం ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే పిచ్ పరిస్థితిని బట్టి జట్టులో మార్పులు జరిగే అవకాశముంది.
- By Praveen Aluthuru Published Date - 08:50 PM, Sat - 28 October 23
world cup 2023: ప్రపంచకప్ లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన తదుపరి మ్యాచ్ ని ఇంగ్లాండ్ తో ఆడనుంది. లక్నో వేదికగా ఆదివారం ఇరు జట్లు తలపడనున్నాయి. అయితే పిచ్ పరిస్థితిని బట్టి జట్టులో మార్పులు జరిగే అవకాశముంది.
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయకారణంగా హార్దిక్ పాండ్య జట్టు నుంచి తప్పుకున్నాడు. ప్రస్తుతం హార్దిక్ బెంగుళూరులోని ఎన్సిఎలా చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. ఇక ఆల్ రౌండర్ గా శార్దూల్ ఠాకూర్ ప్రభావం చూపించలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో ఠాకూర్ చేసిందేమి లేదు. దీంతో ఠాకూర్ ని డగౌట్ లో కూర్చోపెట్టి మహమ్మద్ షమీని తుది జట్టులో తీసుకున్నారు. అయితే వచ్చిన అవకాశాన్ని షమీ అద్భుతంగ వినియోగించుకున్నాడు. న్యూజిలాండ్ పై తొలి బంతికే తొలి వికెట్ పడగొట్టాడు. పటిష్టమైన ఆ జట్టు ఐదు కీలక వికెట్లను పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. దాంతో షమీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
లక్నో పిచ్ స్పిన్ బౌలింగ్ కి సహకరిస్తుంది కాబట్టి షమీకి విశ్రాంతి తప్పదని అంటుంటున్నారు. శమికి రెస్ట్ ఇచ్చి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను జట్టులోకి తీసుకోవాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. అయితే రోహిత్ మాత్రం శమిని జట్టులో కొనసాగించి సిరాజ్ కు విశ్రాంతి కల్పించాలని అనుకుంటున్నాడట. షమీని పక్కన పెట్టడాన్ని అభిమానులు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఐదు వికెట్లు తీసి ఫామ్ లో ఉన్న ప్లేయర్ ని పక్కనపెడితే విమర్శలు తప్పవు. ఈ నేపథ్యంలో షమీని తుది జట్టు నుంచి తప్పించే సాహసం టీమిండియా చేయకపోవచ్చు. దీంతో మహ్మద్ సిరాజ్ కి విశ్రాంతినిచ్చి.. షమీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది.బౌలింగ్ విభాగంలో షమీ, అశ్విన్, కుల్దీప్ బుమ్రా కీ రోల్ ప్లే చేయనున్నారు. బ్యాటింగ్ విషయానికి వస్తే.. రోహిత్ శర్మ, గిల్ ఓపెనర్లుగా దిగుతారు. వన్ డౌన్ లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లు మిడిలార్డర్ లో కీ రోల్ ప్లే చేయనున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఫినిషర్ రోల్ ప్లే చేయనున్నాడు. సూర్యకి తోడుగా జడేజా ఉన్నాడు. గత మ్యాచ్ లో కోహ్లీతో కలిసి జిడ్డు జట్టుని విజయతీరాలకు చేర్చిన విషయం తెలిసిందే. కీలక సమయంలో అద్భుతంగ ఆడి హార్దిక్ లేని లోటును జడేజా పూడ్చాడు.
Also Read: Rajinikanth : రజినీకాంత్తో ఈ ఫొటోలో ఉన్న బాబు ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు స్టార్ హీరో..
Related News
Champions Trophy 2025: పాకిస్తాన్లో పర్యటించనున్న భారత్.. రహస్యంగా ఉంచాలని కోరిన ఐసీసీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు క్వాలిఫైయింగ్ మ్యాచ్లన్నీ ఒకే నగరంలో జరగాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అంటే ICCకి సూచించింది.