India Vs Pakistan: దుమారం రేపుతున్న టీమిండియా- పాకిస్థాన్ మ్యాచ్ల మధ్య పోస్టర్..!
స్టార్ స్పోర్ట్స్.. ఇండియా- పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్ల మధ్య పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్ట్లో రెండు జట్ల కెప్టెన్లను చూపించారు. ఈ పోస్టర్ బయటకు రావడంతో దుమారం రేగింది.
- By Gopichand Published Date - 04:14 PM, Sat - 6 January 24

India Vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఐసీసీ శుక్రవారం అన్ని జట్ల మ్యాచ్ల షెడ్యూల్ను విడుదల చేసింది. ఆ తర్వాత ఏ టీమ్ మ్యాచ్ ఏ రోజు, ఏ టీమ్తో జరుగుతుందో తేలిపోయింది. దీని ప్రకారం టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా తన ప్రచారాన్ని జూన్ 5 నుంచి ప్రారంభించనుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో టీమ్ ఇండియా తొలి మ్యాచ్ ఐర్లాండ్తో జూన్ 5న జరగనుంది. ఈ మ్యాచ్ న్యూయార్క్లో జరుగుతుంది. ఇది కాకుండా భారత జట్టు జూన్ 9న పాకిస్థాన్తో ఆడనుంది. ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్.. ఇండియా- పాకిస్థాన్ (India Vs Pakistan) మ్యాచ్ల మధ్య పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్ట్లో రెండు జట్ల కెప్టెన్లను చూపించారు. ఈ పోస్టర్ బయటకు రావడంతో దుమారం రేగింది.
పోస్టర్లో రోహిత్ స్థానంలో హార్దిక్ కనిపించాడు
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్కు సంబంధించి ఇరు జట్ల కెప్టెన్లతో కూడిన పోస్టర్ను స్టార్ స్పోర్ట్స్ షేర్ చేసింది. ఇందులో రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను భారత జట్టు కెప్టెన్గా చూపించారు. ఈ పోస్ట్ వెలువడిన తర్వాత.. 2024 T20 ప్రపంచ కప్లో హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియాకు సారథ్యం వహిస్తాడా లేదా అనే అనేక ప్రశ్నలు సోషల్ మీడియాలో యూజర్స్ నుండి లేవనెత్తుతున్నాయి.
Also Read: Formula E Race: ఫార్ములా ఇ రేసు రద్దు చేయడంపై కేటీఆర్ ఫైర్
మరోవైపు.. హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తిగా ఫిట్గా లేడు. అతను జట్టులోకి తిరిగి రావడానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. గత ఏడాది కాలంగా హార్దిక్ పాండ్యా టీ20 క్రికెట్లో టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పుడు హార్దిక్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. జనవరి 11 నుంచి అఫ్గానిస్తాన్తో జరిగే టీ20 సిరీస్లో రోహిత్ శర్మను కెప్టెన్గా చూసే అవకాశం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
అమెరికా, వెస్టిండీస్లో 2024 టీ20 ప్రపంచకప్
ఈసారి 2024 టీ20 ప్రపంచకప్కు అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024లో టీమ్ ఇండియా గ్రూప్ ఏలో చేరింది. తొలి గ్రూప్లో భారత్తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడా జట్లు చోటు దక్కించుకున్నాయి. భారత జట్టు తొలి మ్యాచ్ ఐర్లాండ్తో ఆడనుంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్ల్లో పాకిస్థాన్తో టీమ్ ఇండియాకు గట్టి పోటీ ఎదురుకావచ్చు.