Shikhar Dhawans Retirement: శిఖర్ ధావన్ రిటైర్మెంట్ పై రోహిత్, విరాట్ స్పందన
2022 డిసెంబర్ 10న భారత్ తరఫున ధావన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు. పునరాగమనం చేసేందుకు ప్రయత్నించినా కుర్రాళ్ళ ఎంట్రీతో అది సాధ్యపడలేదు. చివరకు 38 ఏళ్ల వయసులో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ధావన్ రిటైర్మెంట్ ప్రకటనపై కోహ్లీ, రోహిత్ సోషల్ మీడియా సైట్ ఎక్స్ ద్వారా అతని సేవలకు గానూ కృతజ్ఞతలు తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 03:15 PM, Sun - 25 August 24

Shikhar Dhawans Retirement: భారత అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలో ఒకరైన శిఖర్ ధావన్ శనివారం అంతర్జాతీయ మరియు దేశీయ క్రికెట్కు రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఈ మేరకు సోషల్మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గబ్బర్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంపై అతని అభిమానులు చాలా బాధపడ్డారు. ఒకప్పుడు తన ఓపెనింగ్ ఇన్నింగ్స్ లో శిఖర్ నెలకొల్పిన రికార్డుల్ని గుర్తు చేసుకున్నారు.కాగా తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పందించారు.
2022 డిసెంబర్ 10న భారత్ తరఫున ధావన్ తన చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి అతను జట్టుకు దూరమయ్యాడు. పునరాగమనం చేసేందుకు ప్రయత్నించినా కుర్రాళ్ళ ఎంట్రీతో అది సాధ్యపడలేదు. చివరకు 38 ఏళ్ల వయసులో క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ధావన్ రిటైర్మెంట్ ప్రకటనపై కోహ్లీ సోషల్ మీడియా సైట్ ఎక్స్లో ధావన్ను గుర్తు చేసుకున్నాడు. ధావన్ నిర్భయ క్రికెటర్ అని, భారత్కు నమ్మకమైన ఓపెనర్ చెప్పాడు. మీరు గుర్తుంచుకోవడానికి మాకు చాలా జ్ఞాపకాలను అందించారు. ఆట పట్ల మీ అభిరుచి, మీ క్రీడాస్ఫూర్తి మరియు మీ ట్రేడ్మార్క్ చిరునవ్వు ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది, కానీ మీ వారసత్వం మీ తదుపరి ఇన్నింగ్స్కు మీరు అందించిన మరపురాని ప్రదర్శనలకు ధన్యవాదాలు, గబ్బర్ అంటూ విరాట్ కోహ్లీ పోస్ట్ పెట్టాడు.
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మతో ధావన్ అనుబంధం చాలా ప్రత్యేకమైనది. వీరిద్దరూ చాలా కాలంగా ఓపెనింగ్ జోడీగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. శిఖర్ ధావన్ 12 ఏళ్ల ఆట చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నాడు. ధావన్ రిటైర్మెంట్ ప్రకటన తర్వాత రోహిత్ ధన్యవాదాలు తెలిపాడు.రూమ్ విశేషాల నుంచి మైదానంలో ఓపెనింగ్ జోడీని పంచుకోవడం వరకు రోహిత్ శర్మ గుర్తు చేసుకున్నాడు.మీరు ఎల్లప్పుడూ అవతలి వైపు ఉండి నా పనిని సులభతరం చేసారు అంటూ ధావన్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.
హిట్మ్యాన్ మరియు గబ్బర్ 117 సందర్భాల్లో కలిసి బ్యాటింగ్ చేసి 5193 పరుగులు చేశారు, ఇందులో 18 సెంచరీలు మరియు 15 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2018 ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన 210 పరుగుల భాగస్వామ్యం అతని అత్యుత్తమ ఇన్నింగ్స్. 117 ఇన్నింగ్స్లలో అతను 45.15 సగటుతో భాగస్వామ్యాన్ని కొనసాగించాడు. భారత క్రికెట్ చరిత్రలో మూడో అత్యంత విజయవంతమైన బ్యాటింగ్ భాగస్వామ్యాన్ని రోహిత్ మరియు ధావన్ కలిగి ఉన్నారు. వాళ్ళకంటే ముందు ఈ రికార్డులు సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ మరియు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ పేర్లలో ఉన్నాయి. అత్యంత విజయవంతమైన భాగస్వామ్యాల జాబితాలో ధావన్-రోహిత్ జోడీ ఎనిమిదో స్థానానికి చేరుకుంది.
2022 డిసెంబర్లో చిట్టగాంగ్లో బంగ్లాదేశ్తో జరిగిన వన్డేలో భారత్ తరఫున ధావన్ చివరిసారిగా కనిపించాడు, అయితే అతని చివరి టి20 శ్రీలంకలో జూలై 2021లో జరిగింది. 2018 నుంచి భారత్ తరఫున ఎలాంటి టెస్టు ఆడలేదు.
Also Read: PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్కు వెళ్తారా ?