Ranji Trophy: రంజీ ట్రోఫీలో రెచ్చిపోయిన రవీంద్ర జడేజా.. 5 వికెట్లతో విధ్వంసం!
సౌరాష్ట్ర బౌలింగ్లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో జడేజా 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి 5 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు.
- Author : Gopichand
Date : 23-01-2025 - 3:43 IST
Published By : Hashtagu Telugu Desk
Ranji Trophy: రంజీ ట్రోఫీ (Ranji Trophy) 2024-25 రెండో దశలో రవీంద్ర జడేజా స్పిన్ మాయాజాలం కనిపించింది. ఢిల్లీపై జడేజా 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ను కూడా జడేజా అవుట్ చేశాడు. రంజీ ట్రోఫీ 2024-25లో ఈరోజు ఢిల్లీ-సౌరాష్ట్ర మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కూడా ఆడుతున్నారు. ఢిల్లీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో నిరాశపర్చగా.. సౌరాష్ట్ర ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు. జడేజా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఢిల్లీ బ్యాట్స్మెన్ను ఇబ్బందుల్లోకి నెట్టాడు.
ఢిల్లీ జట్టు 188 పరుగులకే కుప్పకూలింది
సౌరాష్ట్ర అద్భుత బౌలింగ్ ముందు ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 188 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ తరఫున బ్యాటింగ్ చేసిన కెప్టెన్ ఆయుష్ బదోనీ అత్యధిక ఇన్నింగ్స్లో 60 పరుగులు చేశాడు. ఇది కాకుండా యష్ ధుల్ 44 పరుగులు, మయాంక్ 38 అజేయంగా రాణించారు.
Also Read: Harish Kumar Gupta : ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా.. చంద్రబాబు రాగానే కీలక ప్రకటన
సౌరాష్ట్ర బౌలింగ్లో రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలింగ్లో జడేజా 17.4 ఓవర్లలో 66 పరుగులిచ్చి 5 ముఖ్యమైన వికెట్లు పడగొట్టాడు. దీంతో ఢిల్లీ జట్టు 200 స్కోరును కూడా అందుకోలేకపోయింది. రవీంద్ర జడేజాతో పాటు ధర్మేంద్ర జడేజా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి 19 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్కు శుభసూచకం
గతంలో రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నిరాశపర్చాడు. ఈ సిరీస్లో జడేజా బ్యాట్తో కచ్చితంగా రాణించినప్పటికీ.. బౌలింగ్లో జడేజా ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు జడేజా కూడా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియాలో ఎంపికయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా మళ్లీ ఫామ్లోకి రావడం టీమ్ఇండియాకు మంచి సంకేతాలు ఇస్తోంది.