Suryakumar Yadav: నేను ఆడితే ధోనీతోనే ఆడతాను: సూర్యకుమార్ యాదవ్
సూర్య తాను నోవాక్ జోకోవిచ్ను చూడటానికి వచ్చానని తెలిపాడు. పాత ఆటగాళ్లలో రోజర్ ఫెడరర్, పీట్ సాంప్రాస్లను ఇష్టపడినట్లు చెప్పాడు. అయితే, అతని ఆల్-టైమ్ ఫేవరెట్ ఆటగాడు జోకోవిచ్ అని పేర్కొన్నాడు.
- Author : Gopichand
Date : 11-07-2025 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
Suryakumar Yadav: 2025 వింబుల్డన్ మ్యాచ్లను చూడటానికి ఈ ఏడాది అనేక భారత క్రికెటర్లు హాజరయ్యారు. ఈ జాబితాలో తాజాగా భారత T20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కూడా చేరాడు. ఈ సందర్భంగా సూర్య.. టెన్నిస్ పట్ల తనకున్న ఇష్టాన్ని, తన ఫేవరెట్ ఆటగాడి గురించి వెల్లడించాడు. అంతేకాక సూర్యకుమార్ ఎంఎస్ ధోనీతో కలిసి టెన్నిస్ డబుల్స్ జట్టుగా ఆడాలనే తన కోరికను వ్యక్తం చేశాడు. అతను ధోనీని తన టెన్నిస్ డబుల్స్ భాగస్వామిగా ఎంచుకున్నాడు.
స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ డబుల్స్ భాగస్వామిగా ఏ క్రికెటర్ను ఎంచుకుంటాడని అడిగినప్పుడు సూర్య ధోనీ పేరును పేర్కొన్నాడు. అతను ఇలా అన్నాడు. “ధోనీలో వేగం ఉంది. శక్తి ఉంది. అత్యంత ముఖ్యమైనది అతని మనస్సు చాలా వేగంగా పనిచేస్తుంది. అతను మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు. ఇటీవల, అతను క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్నప్పుడల్లా నేను అతన్ని టెన్నిస్ ఆడుతూ చూశాను. కాబట్టి, ఎటువంటి సంకోచం లేకుండా నా ఎంపిక ధోనీనే.” సూర్య మొదటిసారి వింబుల్డన్కుసూర్యకుమార్ యాదవ్ మొదటిసారి వింబుల్డన్ చూడటానికి వచ్చాడు. అతను ఇలా అన్నాడు. “ఇది నా మొదటి వింబుల్డన్ అనుభవం, ప్రతిదీ సరిగ్గా జరగాలని నేను కోరుకున్నాను. నిజాయితీగా చెప్పాలంటే, నా భార్య నన్ను చాలా బాగా చూసుకుంటుంది. గత మూడు లేదా నాలుగు రోజులుగా ఆమె నాతో ఉంది. ఈ అద్భుతమైన టోర్నమెంట్ కోసం నేను ఏం ధరించాలో నిర్ణయించడంలో సహాయం చేస్తోంది. ఇక్కడ చాలా మంది వచ్చారు, నేను కూడా వారిలో ఒకడిని, వారు అనుభవిస్తున్న అదే అనుభూతిని అనుభవించడానికి వచ్చాను” అని పేర్కొన్నాడు.
Also Read: Chest burning : ఛాతి భాగంలో అదే పనిగా మంట వస్తుందా? ఇది దేనికి సంకేతం?
నోవాక్ జోకోవిచ్ సూర్యకు ఫేవరెట్ ఆటగాడు
సూర్య తాను నోవాక్ జోకోవిచ్ను చూడటానికి వచ్చానని తెలిపాడు. పాత ఆటగాళ్లలో రోజర్ ఫెడరర్, పీట్ సాంప్రాస్లను ఇష్టపడినట్లు చెప్పాడు. అయితే, అతని ఆల్-టైమ్ ఫేవరెట్ ఆటగాడు జోకోవిచ్ అని పేర్కొన్నాడు. ప్రస్తుత ఆటగాళ్లలో కార్లోస్ అల్కరాజ్ను కూడా అతను చాలా ఇష్టపడతానని చెప్పాడు.
వింబుల్డన్ 2025లో ఇతర భారత క్రికెటర్లు
సూర్యకుమార్ యాదవ్తో పాటు ఈ ఏడాది వింబుల్డన్కు హాజరైన ఇతర భారత క్రికెటర్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, యజ్వేంద్ర చాహల్, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరంతా లార్డ్స్లో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ తర్వాత వింబుల్డన్ను సందర్శించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ కూడా జోకోవిచ్ను ప్రశంసిస్తూ ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టాడు. అతని ఆటను “స్ఫూర్తిదాయకం” అని అభివర్ణించాడు.