India Test Team: రోహిత్ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్గా ఎవరు ఎంపిక అవుతారు? రేసులో యువ ఆటగాళ్లు!
బోర్డుకు చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా పోటీదారులలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు.
- Author : Gopichand
Date : 06-02-2025 - 11:40 IST
Published By : Hashtagu Telugu Desk
India Test Team: విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత 2022 ఫిబ్రవరి నుంచి రోహిత్ శర్మ భారత శాశ్వత టెస్టు కెప్టెన్. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక్కడ నిరంతర పేలవమైన ప్రదర్శనతో టెస్ట్ జట్టులో అతని స్థానం అనుమానాస్పదంగా మారింది. పేలవమైన ఫామ్ కారణంగా రోహిత్ సిడ్నీలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదవ మ్యాచ్కు దూరంగా ఉన్నాడు. ఒకవేళ రోహిత్ మళ్లీ ఫామ్లోకి వచ్చినా.. ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కి ముందు అతనికి 38 సంవత్సరాలు వస్తాయి. అందుకే భవిష్యత్తు కోసం బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గత కొంతకాలంగా టెస్టు జట్టుకు (India Test Team) వైస్ కెప్టెన్గా కనిపిస్తున్నాడు. కానీ అతని ఫిట్నెస్ గురించి నిరంతరం ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా BCCI అతనిని భారత తదుపరి టెస్ట్ కెప్టెన్గా చేయడంపై సందేహంలో పడింది. ఒక బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. బుమ్రా సుదీర్ఘ టెస్ట్ సిరీస్ లేదా మొత్తం సీజన్ను ఆడే అవకాశాలు ఎల్లప్పుడూ సందేహాస్పదంగా ఉంటాయి. కాబట్టి సెలెక్టర్లు టెస్టు జట్టు కెప్టెన్ కోసం స్థిరమైన ఆటగాడిని ఎంపిక చేయాలని చూస్తున్నారు అని పేర్కొన్నాడు.
Also Read: Northern Superchargers: మరో కొత్త జట్టును కొనుగోలు చేసిన కావ్య మారన్.. రూ. 1000 కోట్ల డీల్!
పోటీలో కేఎల్ రాహుల్
బోర్డుకు చాలా తక్కువ ఎంపికలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు కూడా పోటీదారులలో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. రాహుల్ గత 12-15 నెలల్లో మంచి ప్రదర్శన చేసినప్పటికీ జట్టులో అతని స్థానం గురించి బీసీసీఐ ఖచ్చితంగా ఉన్నట్లు అనిపించడం లేదు. పంత్ పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు. అతను చాలా కాలం క్రితం టెస్టు క్రికెట్కు కెప్టెన్గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కారు ప్రమాదం కారణంగా పంత్ మళ్లీ మొదటి నుంచి ఆడాల్సి వస్తోంది.
పోటీదారులలో మరో పేరు శుభ్మన్ గిల్. గిల్ ODI, T-20 రెండింటిలోనూ వైస్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ టెస్టు క్రికెట్లో అతని ప్రదర్శన అంతగా లేదు. నివేదికలో అత్యంత షాకింగ్ విషయం ఏమిటంటే.. పోటీదారుల పేర్లలో యశస్వి జైస్వాల్ పేరు కూడా ఉండటం గమనార్హం. 22 ఏళ్ల యశస్వి కేవలం 18 నెలలు మాత్రమే టెస్టు క్రికెట్ ఆడాడు. అయితే అతని ప్రతిభ BCCI యశస్వి పేరును పరిగణనలోకి తీసుకునేలా చేసినట్లు నివేదిక పేర్కొంది.