MS Dhoni: ఎంఎస్ ధోనీ ఐపీఎల్కు గుడ్ బై చెప్పనున్నాడా? అప్డేట్ ఇదే!
ఐపీఎల్ 2025 సమీపిస్తున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించి ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలుచుకుంది.
- Author : Gopichand
Date : 04-05-2025 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
MS Dhoni: ఐపీఎల్ 2025 సమీపిస్తున్న కొద్దీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి సంబంధించి ఐపీఎల్ 2025 అతని చివరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి. ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలుచుకుంది. జట్టుకు కొత్త గుర్తింపును అందించింది. అయితే ప్రస్తుత సీజన్లో జట్టు పనితీరు ఆశించిన స్థాయిలో లేనప్పటికీ.. ధోనీ మైదానంలో ఉండటం అభిమానులకు ఒక స్ఫూర్తిదాయక అనుభవం. ఈ నేపథ్యంలో ధోనీ బాల్య కోచ్ కేశవ్ రంజన్ బెనర్జీ అతని భవిష్యత్తుపై పెద్ద ప్రకటన చేశారు.
ధోనీని వచ్చే ఏడాది కూడా ఆడుతూ చూడవచ్చు – బెనర్జీ
ఆయన‘టైమ్స్ నౌ’తో మాట్లాడుతూ.. ధోనీ ప్రస్తుతం వచ్చే ఏడాది కోసం యువ సీఎస్కే జట్టును సిద్ధం చేస్తున్నారని, అందువల్ల అతను ఐపీఎల్ 2026లో కూడా ఆడే అవకాశం ఉందని బెనర్జీ తెలిపారు. ఆయన ఇలా అన్నారు. “ఈ సంవత్సరం ఐపీఎల్లో ధోనీకి చివరి సంవత్సరమా కాదా అనేది ధోనీకి మాత్రమే తెలుసు. మనమందరం అతను ఆడగలిగినంత కాలం ఆడాలని కోరుకుంటాం. సీఎస్కే కోరుకుంటే ఐపీఎల్ 2025 ఆక్షన్కు ముందు ధోనీతో సంబంధం తెంచుకుని ఉండేది. వారు కోరుకుంటే మెగా ఆక్షన్లో కూడా పాల్గొని ఉండేవారు. అయితే, వారు ధోనీ జట్టులో కొనసాగాలని, ఈ జట్టును సిద్ధం చేయాలని కోరుకున్నారు. అందువల్ల మనం అతన్ని వచ్చే ఐపీఎల్లో కూడా ఆడుతూ చూడవచ్చు.” అని తెలిపారు.
Also Read: Road accident : మానవత్వం చాటుకున్న హరీశ్ రావు..జనాల ప్రశంసలు
ఇంతకుముందు దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ ధోనీ గురించి మాట్లాడుతూ.. అతను కేవలం సీఎస్కే హితాన్ని దృష్టిలో ఉంచుకుని ఆడుతున్నాడని అన్నారు. గవాస్కర్ ఇలా అన్నారు.. “ఏ ఆటగాడూ తన కోసం కాకుండా, జట్టుకు ఏది మంచిదో అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాడు. ఈ సీజన్లో ఆడాలా వద్దా అనే విషయంపై ధోనీ తీసుకున్న నిర్ణయం పూర్తిగా సీఎస్కేకు ఉత్తమమైనది అవుతుంది. భవిష్యత్తులో అతని ఏ నిర్ణయమైనా సీఎస్కేకు ఏది మంచిది అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అది అతనికి స్వయంగా ఏది మంచిది అనే విషయం కావలసిన పనిలేదు.”