IPL Record: ఐపీఎల్లో నేటికి చెక్కుచెదరని రికార్డు.. 30 బంతుల్లోనే సెంచరీ..!
2008లో ప్రారంభమైన ఐపీఎల్ (IPL Record) నేడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్గా అవతరించింది.
- By Gopichand Published Date - 01:23 PM, Mon - 4 March 24
IPL Record: 2008లో ప్రారంభమైన ఐపీఎల్ (IPL Record) నేడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్గా అవతరించింది. ప్రతి సంవత్సరం జరిగే ఈ టోర్నమెంట్లో భారతీయులతో సహా ప్రపంచంలోని అనేక దేశాల నుండి ఆటగాళ్ళు ఆడటానికి వస్తారు. వారు బ్యాటింగ్ నుండి బౌలింగ్ వరకు ప్రతిదానిలో రికార్డులు సృష్టిస్తూ.. బద్దలు చేస్తూనే ఉన్నారు. వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ 2013 సంవత్సరంలో అలాంటి ఒక రికార్డు సృష్టించాడు. ఇది ఎప్పటికీ బద్దలు కాదు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్లో ఆరంభం నుంచి సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిసింది.
క్రిస్ గేల్ 30 బంతుల్లో సెంచరీ సాధించాడు
2013లో ఐపీఎల్ ఆరవ సీజన్ జరుగుతుండగా ఏప్రిల్ 23న సీజన్లోని 31వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- పూణే వారియర్స్ పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. క్రిస్ గేల్, తిలకరత్నే దిల్షాన్లు జట్టు ఇన్నింగ్స్ను ప్రారంభించారు. తొలి ఓవర్లో 3 పరుగులు మాత్రమే వచ్చినా.. రెండో ఓవర్లో ఈశ్వర్ పాండే వేసిన ఓవర్లో క్రిస్ గేల్ 21 పరుగులు చేశాడు. గేల్ను నిలువరించడంలో భువనేశ్వర్ కుమార్ సఫలమైనప్పటికీ మిచెల్ మార్ష్ వేసిన ఓవర్లో గేల్ 4 సిక్సర్లు, 1 ఫోర్ బాది 28 పరుగులు చేశాడు.
Also Read: Sunrisers Hyderabad: కొత్త కెప్టెన్ను ప్రకటించిన సన్రైజర్స్ హైదరాబాద్..!
దాదాపు పూణె బౌలర్లందరూ గేల్ తుఫాను స్టైల్ ముందు లొంగిపోయారు. గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేసి రికార్డు సృష్టించాడు. తొలి 30 బంతుల్లో 8 ఫోర్లు, 11 సిక్సర్లు బాది సెంచరీ చేశాడు.
ఇన్నింగ్స్ 9వ ఓవర్లో గేల్ సెంచరీ పూర్తి చేశాడు. సెంచరీ పూర్తి చేసిన తర్వాత కూడా ఫోర్లు, సిక్సర్లు బాదుతూనే ఉన్నాడు. ఈ ఇన్నింగ్స్లో గేల్ 66 బంతులు ఆడి 13 ఫోర్లు, 17 సిక్సర్లతో అజేయంగా 175 పరుగులు చేశాడు. నేటికీ ఐపిఎల్లో ఏ ఆటగాడు చేసిన అత్యధిక స్కోరు ఇదే. దీనిని బద్దలు కొట్టడం అసాధ్యం.
We’re now on WhatsApp : Click to Join
Related News
CSK vs SRH: చెపాక్ లో హైదరాబాద్ ని చిత్తుగా ఓడించిన చెన్నై
చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. 78 పరుగుల తేడాతో రుతురాజ్ సేన పాట్ కమిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్ ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్ లో చెన్నై 200 స్కోర్ చేయడం ద్వారా టీ20 క్రికెట్లో చెన్నై 35వ సారి 200 ప్లస్ స్కోర్ చేసింది.