IND Vs WI: జులై 12 నుంచి వెస్టిండీస్తో టెస్టు సిరీస్.. ఆ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికి..?
వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ (IND Vs WI)కు భారత క్రికెట్ బోర్డు (BCCI) టీమిండియాను ప్రకటించింది.
- Author : Gopichand
Date : 24-06-2023 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
IND Vs WI: వెస్టిండీస్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ (IND Vs WI)కు భారత క్రికెట్ బోర్డు (BCCI) టీమిండియాను ప్రకటించింది. ఈ టీమ్లో ముగ్గురు కొత్త ముఖాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎడమ చేతి బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్, ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ ఉన్నారు. ఈ ముగ్గురు ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శన చేశారు. విండీస్తో జరిగే టెస్టు సిరీస్లో భాగంగా ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీని సెలెక్టర్లు టీమిండియాలోకి తీసుకున్నారు. చాలా కాలం తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. సైనీ ఇప్పటివరకు భారత్ తరఫున 2 టెస్టు మ్యాచ్లు ఆడాడు. అతను తన చివరి టెస్టును జనవరి 2021లో ఆడాడు.
టెస్టు జట్టు నుంచి పుజారా, ఉమేష్ ఔట్
వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్కు సెలక్టర్లు సీనియర్ బ్యాట్స్మెన్ ఛెతేశ్వర్ పుజారా, ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్లను జట్టులోకి తీసుకోలేదు. అదే సమయంలో పనిభారం దృష్ట్యా మహ్మద్ షమీకి విశ్రాంతి ఇచ్చారు. విండీస్తో టెస్టు సిరీస్కి శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీలుగా ఐదుగురు ఫాస్ట్ బౌలర్లు ఎంపికయ్యారు.
Also Read: Asian Games: ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్లు.. చైనాలో ఆసియా క్రీడలు
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ షెడ్యూల్
మొదటి మ్యాచ్: జూలై 12 నుండి జూలై 16 వరకు – విండ్సర్ పార్క్, రోసో, డొమినికాలో
రెండవ మ్యాచ్: 20 జూలై నుండి జూలై 24 వరకు – క్వీన్స్ పార్క్ ఓవల్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్, ట్రినిడాడ్లో
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రితురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (రిజర్వ్ వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.