IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది.
- By Praveen Aluthuru Published Date - 06:48 PM, Wed - 10 January 24
IND vs ENG: జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు విద్యార్థులకు శుభవార్త తెలిపింది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వివరాలలోకి వెళితే
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది. మొహాలి వేదికగా రేపు రాత్రి 7 గంటలకు తొలి టి20 మ్యాచ్ జరగనుంది. ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే సిరీస్ అనంతరం రోహిత్ సేన ఇంగ్లాడ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది.
టెస్టు ఛాంపియన్ షిప్లో టాప్2లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే టీమిండియాకు ఇంగ్లాండ్తో జరిగే టెస్టు సిరీస్ గెలవాల్సి ఉంది. దీనిలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జనవరి 25న తొలి టెస్ట్ మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈక్రమంలో తెలంగాణ విద్యార్థులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బంపరాఫర్ ప్రకటించింది. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజనం కూడా అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్కు రావొచ్చని తెలిపింది.మ్యాచ్ను చూడాటానికి వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫామ్లోనే స్టేడియానికి రావాలని హెచ్సీఏ సూచించింది. ఇందుకోసం పాఠశాలల ప్రిన్సిపాల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు, సిబ్బంది వస్తున్నారో ముందుగా తెలియజేయాలి.
జనవరి 18వ తేదీలోపు హెచ్సీఏ సీఈవోకు ceo.hydca@gmail.com కు మెయిల్ చేయాల్సి ఉంటుంది. హెచ్ సీఏ కల్పించిన ఈ సౌకర్యానికి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్లను నేరుగా చూసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు
Related News
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.