CSK In Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్..!
లక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK In Electoral Bonds) పేరు కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ను 'చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్' అనే కంపెనీ నిర్వహిస్తోంది. దీని మాతృ సంస్థ ఇండియా సిమెంట్.
- By Gopichand Published Date - 11:11 AM, Mon - 18 March 24
CSK In Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు పబ్లిక్గా మారిన తర్వాత, దాని గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏయే కంపెనీలు ఏయే రాజకీయ పార్టీలకు నిధులు ఇచ్చాయో కూడా బాండ్ల వివరాలను బట్టి తెలుస్తున్నది. ఈ క్రమంలో ఎలక్టోరల్ బాండ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK In Electoral Bonds) పేరు కూడా ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ను ‘చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్’ అనే కంపెనీ నిర్వహిస్తోంది. దీని మాతృ సంస్థ ఇండియా సిమెంట్.
భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ టీమ్ను కలిగి ఉన్న కంపెనీ తమిళనాడులోని ‘ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం’ అంటే ఏఐఏడీఎంకేకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బు ఇచ్చింది. ది హిందూ నివేదిక ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఏఐఏడీఎంకే రూ.6.05 కోట్లు అందుకుంది. ఈ డబ్బులో ఎక్కువ భాగం చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (ఇండియా సిమెంట్ లిమిటెడ్ డైరెక్టర్) నుండి వచ్చింది.
Also Read: Hanuman: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న హనుమాన్.. భారీగా ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్?
చెన్నై సూపర్ కింగ్స్ ఏఐఏడీఎంకేకు ఎంత డబ్బు ఇచ్చింది..?
‘చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్’ రెండు రోజుల్లోనే ఏఐఏడీఎంకేకు రూ.5 కోట్ల నిధులు అందించింది. ఈ డబ్బు 2019 ఏప్రిల్ 2, 4 మధ్య ఇవ్వబడింది. అయితే దీని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ నుంచి పార్టీకి ఎలాంటి డబ్బు రాలేదు. ఎన్నికల సంఘం ఎన్నికల వ్యయ విభాగం కార్యదర్శితో పంచుకున్న సమాచారం ప్రకారం.. పార్టీ కోయంబత్తూర్కు చెందిన లక్ష్మీ మెషిన్ వర్క్స్ లిమిటెడ్ నుండి రూ. 1 కోటి, చెన్నైకి చెందిన గోపాల్ శ్రీనివాసన్ నుండి రూ. 5 లక్షలు రాజకీయ విరాళాలుగా పొందింది.
We’re now on WhatsApp : Click to Join
డీఎంకేకు ఎంత డబ్బు వచ్చింది..?
తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకు సంబంధించి కూడా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. డీఎంకే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.656.6 కోట్లు పొందింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన రూ.656.6 కోట్లలో ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ద్వారా రూ.509 కోట్లు వచ్చినట్లు డీఎంకే వెల్లడించింది. ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ నుండి వచ్చిన విరాళాలు DMK అందుకున్న మొత్తం రాజకీయ విరాళాలలో 77 శాతానికి పైగా ఉన్నాయి. ఈ కంపెనీ యజమాని శాంటియాగో మార్టిన్పై కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుగుతోంది.
Related News
Smoke Biscuit Banned: స్మోక్ బిస్కెట్లపై నిషేధం…
చెన్నైలో రెడీ-టు-ఈట్ స్మోక్ పిటా, స్మోక్ బిస్కెట్లు మరియు లిక్విడ్ నైట్రోజన్ ఉపయోగించి వండిన ఆహారాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజాగా కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ బాలుడు పొగ బిస్కెట్లు తిని స్పృహ తప్పి పడిపోయాడు,