MS Dhoni: 2029 వరకు ఐపీఎల్ ఆడనున్న ఎంఎస్ ధోనీ?
ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నిరంతరం ఆడుతున్నాడు. ఈ లీగ్లో అత్యధికంగా 264 మ్యాచ్లు ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు.
- Author : Gopichand
Date : 20-03-2025 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
MS Dhoni: భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) 2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమైంది. ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నిరంతరం ఆడుతున్నాడు. ఈ లీగ్లో అత్యధికంగా 264 మ్యాచ్లు ఆడిన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ లీగ్లోని ప్రతి సీజన్లో పాల్గొన్న ఎంపిక చేసిన ఆటగాళ్లలో ధోనీ పేరు కూడా ఉంది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అతని గురించి పెద్ద ప్రకటన చేశాడు.ధోని IPL 2029 వరకు ఆడినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పాడు.
ఐపీఎల్లో ధోనీతో కలిసి ఆడిన ఉతప్ప.. ధోనీ మనసును ఎవరూ చదవలేరని అభిప్రాయపడ్డాడు. ధోనీకి తనదైన మార్గం ఉందని, తర్వాత ఏం చేయబోతున్నారో ఎవరికీ తెలియదని పేర్కొన్నాడు. 43 ఏళ్ల వయసులోనూ ఆడుతూనే ఉన్నాడని తెలిపాడు. మీకు నైపుణ్యం ఉండి ముందుకు వెళ్లాలనే తపన ఉంటే మిమ్మల్ని ఏదీ అడ్డుకోవాలని నేను అనుకోను. ధోనీ ఈ సీజన్ చివరిలో రిటైర్ అయినా నేను ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే దీని తర్వాత అతను మరో నాలుగు సీజన్లు ఆడినా నేను ఆశ్చర్యపోనక్కర్లేదు అని ఉతప్ప్ హింట్ ఇచ్చాడు.
Also Read: Virat Kohli: ఈడెన్ గార్డెన్స్లో విరాట్ కోహ్లీ రికార్డు ఎలా ఉంది?
సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్
IPL ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఐదు టైటిళ్లను గెలుచుకున్న ధోనీ.. 2023 సీజన్ తర్వాత CSK కెప్టెన్సీని శాశ్వతంగా విడిచిపెట్టాడు. ఈ సీజన్లో యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ బాధ్యతలను కలిగి ఉన్నాడు. అయితే ధోనీకి ఫిట్నెస్ సమస్య ఉంది. ధోనీ మోకాలి సమస్యలతో బాధపడ్డాడు. 2023లో అతని ఎడమ మోకాలికి శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో అతను 130 బంతులు మాత్రమే ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నాడు?
2014-15 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో ధోని టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడని, ఆ తర్వాత విరాట్ కోహ్లీ టెస్ట్ జట్టుకు కెప్టెన్గా మారాడని తెలిసిందే. అతని చివరి ODI 2019 ప్రపంచ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ధోనీ 15 ఆగస్టు 2020న అంతర్జాతీయ కెరీర్కు రిటైర్మెంట్ను అధికారికంగా ప్రకటించాడు.