Yamuna River: మరోసారి ఉగ్రరూపం దాల్చిన యమునా నది.. అప్రమత్తమైన ఢిల్లీ?
భారతదేశంలోని ఉత్తరాదిన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వరదలు భారీగా సంభవిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునగగా, చాల
- By Nakshatra Published Date - 03:08 PM, Sun - 23 July 23
భారతదేశంలోని ఉత్తరాదిన వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వరదలు భారీగా సంభవిస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునగగా, చాలామంది మనుషులు కూడా చనిపోయారు. ఆస్తి నష్టంతో పాటు ప్రాణం నష్టం కూడా సంభవిస్తోంది. ఇప్పటికే గంగా యమునా నదులు ఉగ్రరూపం దాల్చాయి. ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో యమునా నది ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీని వరదలు ముంచెత్తాయి.
వరదలు తగ్గుముఖం పడుతున్నాయి అని ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో మరొకసారి యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండడంతో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దాంతో ఢిల్లీ అప్రమత్తమయ్యింది.
◆दिल्ली में यमुना नदी का जलस्तर फिर बढ़ा
◆205.75 मीटर दर्ज किया गया जलस्तर #yamunariver #Delhi #abcnewsmedia pic.twitter.com/KXfKGtmbnI
— Abcnews.media (@abcnewsmedia) July 23, 2023
ఉత్తరాఖండ్ లోని హిమాచల్ ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో హర్యానాలోని హత్నికుండ్ బరాజ్ నుంచి ప్రభుత్వం రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. దీంతో దిగువన ఉన్న ఢిల్లీకి వరద నీరు పోటెత్తింది.
Visuals of Yamuna river from Delhi’s Loha Pul. A surge in discharge from the Hathnikund Barrage into the Yamuna following heavy rain in parts of Uttarakhand and Himachal Pradesh is expected to increase the water level of the river in Delhi. pic.twitter.com/rU8yC6jXFn
— Press Trust of India (@PTI_News) July 23, 2023
దాంతో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. దీంతో ప్రజలు మరోసారి భయ భ్రాంతులకు లోనవుతున్నారు. ఈ క్రమంలోనే యమునా నది రికార్డు స్థాయిలో ఢిల్లీలోని పాత రైల్వే బ్రిడ్జి వద్ద ప్రవాహం 205.75 మీటర్లకు చేరింది. దీంతో ఢిల్లీ రాష్ట్రం అప్రమత్తమయింది.
❗️#YamunaRiver Crosses Danger Mark – Delhi on #HighAlert!
Following #HeavyRains in Himachal & Pradesh and Uttarakhand – the Hathnikund dam has been discharged into the river. Water levels are now almost even with the Old Railway Bridge.
The #CentralWaterCommission (CWC) data… pic.twitter.com/bRUbTlSEp8
— RT_India (@RT_India_news) July 23, 2023
దీంతో అధికారులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యమునా నది పరిసర ప్రాంతాలలో ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. యమునా నది ఉధృతం పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు
Related News
Raghuram Rajan : ‘‘భారత్ పేద దేశం కూడా’’.. ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు
భారత్ అభివృద్ధి చెందుతున్న దేశమా ? అత్యంత పేద దేశమా ? అంటే ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.