HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Union Cabinet Meet What Are The Three Key Decisions Announced By Govt

Union Cabinet Decisions: పండ‌గ‌కు ముందు మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వ‌ర్గం తెలిపింది.

  • By Gopichand Published Date - 08:26 PM, Wed - 9 October 24
  • daily-hunt
Union Cabinet Decisions
Union Cabinet Decisions

Union Cabinet Decisions: ఇవాళ అంటే బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో (Union Cabinet Decisions) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, ఇతర లబ్ధిదారుల పథకాల కింద ఉచిత ధాన్యం పంపిణీని డిసెంబర్ 2028 వరకు కొనసాగించడానికి క్యాబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ ప‌థ‌కాల కింద రూ. 17,082 కోట్లు ఖర్చవుతుందని, దీనిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని తెలుస్తోంది. ఈ మేర‌కు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

పాక్ సరిహద్దులో రోడ్డు నిర్మాణం జరగనుంది

వైబ్రంట్ విలేజ్ ప్రోగ్రాం కింద రాజస్థాన్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో 2280 కి.మీ మేర రోడ్లు నిర్మించాలని కూడా మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ పనులకు రూ.4406 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్ర మంత్రి వ‌ర్గం తెలిపింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి మెరుగుపడుతుందని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ప్రయాణం సులభతరం అవుతుంద‌ని, కొత్త రోడ్లు మొత్తం మిగిలిన హైవే నెట్‌వర్క్‌కు అనుసంధానించబడతాయని ఈ సంద‌ర్బంగా తెలిపారు.

Also Read: Bathukamma Celebrations In Delhi: ఢిల్లీ తెలంగాణ భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

గుజరాత్‌కు చెందిన లోథాల్‌కు బహుమతి లభించింది

దీనితో పాటు గుజరాత్‌లోని లోథాల్‌లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రాజెక్టుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భారతదేశం గొప్ప, వైవిధ్యమైన సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించడం ఈ ప్రతిపాదన లక్ష్యమ‌న్నారు. ఇది సిద్ధమైతే ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర వారసత్వ సముదాయం అవుతుందని కేంద్ర మంత్రి వైష్ణవ్ తెలిపారు. మన సుసంపన్నమైన సముద్ర వైవిధ్యాన్ని పరిరక్షించడం, అభివృద్ధి చేయడం అవసరమ‌న్నారు.

#Cabinet approves development of National Maritime Heritage Complex (NMHC) in Lothal, Gujarat

The proposal aims to showcase India's rich and diverse maritime heritage. It will be the world's greatest Maritime complex once it is developed fully

– Union Minister… pic.twitter.com/piupk37i8R

— PIB India (@PIB_India) October 9, 2024

ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో పూర్తవుతుందని ఆయ‌న తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం ఈ ప్రాజెక్ట్ యువతకు దాదాపు 22,000 ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. వీటిలో ప్రత్యక్షంగా 15,000, పరోక్షంగా 7,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ ప్రాజెక్ట్ స్థానిక కమ్యూనిటీలు, పర్యాటకులు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, వ్యాపారవేత్తలతో సహా అనేక ఇతర వర్గాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర మంత్రివర్గం తెలిపింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central government
  • key decisions
  • Modi Cabinet
  • nda govt
  • pm modi
  • UNION Cabinet
  • Union Cabinet Decisions
  • Union Minister Ashwini Vaishnaw

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Cable Bridge

    Cable Bridge: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. అమరావతిలో ఐకానిక్ బ్రిడ్జి!

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • CM Chandrababu

    Good News: గుడ్ న్యూస్ చెప్పిన కూట‌మి ప్ర‌భుత్వం.. మ‌రో హామీ అమ‌లు!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd