Tirupati Laddu: కల్తీ నెయ్యి ఘటనలో షాకింగ్.. పామ్ ఆయిల్, కెమికల్స్తో కల్తీ నెయ్యి..
Tirupati Laddu: వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి... మీరు ఊహించుకున్న నెయ్యి కాదు..!
- Author : Kavya Krishna
Date : 06-06-2025 - 12:32 IST
Published By : Hashtagu Telugu Desk
Tirupati Laddu: వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి… మీరు ఊహించుకున్న నెయ్యి కాదు..! అసలు నెయ్యి కాదు.. కల్తీ చేసిన నెయ్యి కూడా కాదు, నెయ్యి అని కూడా చెప్పలేని రసాయనాలతో నిండి, నెయ్యిలా కనిపించే మిశ్రమమే. ఈ కల్పిత నెయ్యి ను బోలేబాబా డెయిరీ తయారు చేసి, వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేర్లతో టీటీడీకి సరఫరా చేసినట్టు సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్కు వెల్లడైంది.
నెయ్యి మాఫియా తన తప్పిదాలను ముసుక్కుపెట్టేందుకు సాక్షులను బెదిరించి, అడ్డుకోడానికి పలు నరహంతకమైన చర్యలు చేపడుతోంది. సాక్షులను భయపెట్టడం, తప్పుడు పిటిషన్లు వేసి విచారణను దారితప్పించడం, ఓ సాక్షిని తిరుపతి ఎయిర్ పోర్టులో కిడ్నాప్ చేసి చెన్నై నుండి ఢిల్లీకి పంపించడం వంటి ఘోర చర్యలు వెలుగులోకి వచ్చాయి. మరో సాక్షి పేరుతో తప్పుడు పిటిషన్ వేసినా, నిజమైన ఆ వ్యక్తి హైకోర్టులో తాను అటువంటి పిటిషన్ దాఖలు చేయలేదని ఫిర్యాదు చేశారు.
Romance : వరంగల్ మున్సిపల్ ఆఫీస్ లో రాసలీలల్లో మునిగిపోయిన ఉద్యోగులు
చంద్రబాబు నాయుడు ఈ కేసులో ప్రభుత్వపై చేసిన ఆరోపనలు, వైసీపీ నేతల ఫిర్యాదులను కించపరిచిన మాటలు ఇప్పుడికూడా సత్యంగా నిలుస్తున్నాయి. వైసీపీ కుట్రతో సమస్త వ్యవహారం దాచేందుకు పన్నిన వలయంలో ప్రజలకు నిజం తెలిసిపోతోంది. సుప్రీంకోర్టు సిట్ నియామకం, విచారణ ముందడుగు వేస్తున్నప్పటికీ, వాస్తవాలు మసకబడలేవు.
టీటీడీ ఈ మిశ్రమ నెయ్యిని ఎందుకు దొంగతనం చేసుకున్నది, ఎవరు ఈ కుట్రలో భాగమో సీబీఐ సిట్ త్వరలో సత్యాన్ని బయటపెట్టనుంది. వైవీ సుబ్బారెడ్డి పీఎన్గా ఉన్నప్పుడు జరిగిన అనేక మసకతల వివరాలు, టీటీడీ లోని నెయ్యి మాఫియా గుట్టు పూర్తిగా వెలుగులోకి రానున్నాయి. ఈసారి ఎవ్వరూ దూరమవ్వలేరు. కఠినమైన విచారణ జరుగుతుంది. అందరి సత్యాలు బయటపడటానికి ఇది మొదటి దశ మాత్రమే..!
Kaleshwaram Commission : కేసీఆర్ పై రివెంజ్ తీర్చుకునే టైం ఈటెల కు వచ్చిందా..?