Telangana: విద్యార్థుల కోసం గాంధీ సినిమా ఉచిత ప్రదర్శన
స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14-24 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- By Praveen Aluthuru Published Date - 04:57 PM, Thu - 10 August 23
Telangana: స్వతంత్ర భారత వజ్రోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14-24 తేదీల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ‘గాంధీ’ చిత్రాన్ని ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1982లో విడుదలైన గాంధీ సినిమాలో మహాత్మా గాంధీ పాత్రలో బెన్ కింగ్స్ లే నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు కూడా వరించింది. కాగా స్వతంత్ర వజ్రోత్సవం నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 582 స్క్రీన్లలో ఉచితంగా ప్రదర్శించబడుతుంది. తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర మండలి అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విద్యార్థుల కోసం సినిమాను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారుల్ని మంత్రి తలసాని ఆదేశించారు.
Also Read: Tomato Prices: భారీగా తగ్గిన టమాటా ధరలు, కిలోకు ఎంతంటే
Related News
Yadadri : ప్లాస్టిక్ పై నిషేధం విధించిన యాదాద్రి దేవస్థానం
Yadadri Temple: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్(Plastic)పై నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ నిషధం అమలులో ఉంటుందని ఈవో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్