Amaravati : మున్సిపాలిటీ వద్దు.. రాజధాని ముద్దు.. తుళ్లూరు గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం
- By Prasad Published Date - 07:01 AM, Sun - 18 September 22
మున్సిపాలిటీని వ్యతిరేకిస్తూ తుళ్లూరు గ్రామసభలో రాజధాని ప్రాంత ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తుళ్లూరు మండలలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల ప్రజల మూకుమ్మడి ఏకగ్రీవ తీర్మానం చేశారు.హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై లేదా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 13 జిల్లాల కోసం భూములు త్యాగం చేయమని.. ఆనాడు అధికారులే ప్రజల వద్దకు వచ్చారని రైతులు తెలిపారు. మూడు రాజధానుల బిల్లును ఉద్యోగ సంఘాలు ఎందుకు వ్యతిరేకించడం లేదని వారు ప్రశ్నించారు. మెట్రో పాలిటన్ సిటీనే వద్దంటే మున్సిపాలిటీ పేరుతో అధికారులు పెట్టే గ్రామసభలను ఆమోదించమని తుళ్లూరు వాసులు స్పష్టం చేశారు.
Related News
Lokesh: అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తొచ్చేలా చేస్తా : లోకేశ్
Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తనను గెలిపిస్తే… అభివృద్ధి పేరు చెపితే మంగళగిరి గుర్తుచ్చేలా చేస్తానని టీడీపీ(tdp)యువనేత నారా లోకేశ్(Nara Lokesh) అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తానని చెప్పారు. కుటుంబ సభ్యుడిలా తనను ఆశీర్వదించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో తాను విజయం సాధించాక మంగళగిరి(Mangalagiri)ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళి