Speed News
-
Karate Kalyani:ప్రాణహాని ఉందని పోలీసులదగ్గరికెళ్ళిన కరాటే కల్యాణి
తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని నటి, బీజేపీ నాయకురాలు కరాటే కల్యాణి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Date : 02-01-2022 - 11:34 IST -
Hyderabad:న్యూ ఇయర్ సందర్భంగా 2,500 డ్రంక్ డ్రైవ్ కేసులు
న్యూ ఈయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వేలాది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.
Date : 02-01-2022 - 10:58 IST -
Crime:2021లో తెలంగాణలో అత్యాచార కేసులు 23 శాతం పెరిగాయి
2021 నాటికి తెలంగాణలో అత్యాచార కేసులు 23%, రాష్ట్రంలో నేరాలు 4.65% పెరిగాయని రాష్ట్ర పోలీసుల లెక్కలు చెబుతున్నాయి.
Date : 02-01-2022 - 10:52 IST -
CBN:బాబు ‘ముందస్తు’ మాట
ఏపీలో అప్పుడే ఎలక్షన్స్ హీట్ మొదలైంది. మరో రెండెళ్లలో సాధారణ ఎన్నికలు జరగాల్సిన ఉన్నా ముందస్తుగా జరుగుతాయని ప్రచారం జరుగుతుంది.అయితే దీనిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పదించారు.
Date : 02-01-2022 - 7:30 IST -
TTD:న్యూఢిల్లీలో టీటీడీ వేదపండితులు
శనివారం న్యూఢిల్లీలో టిటిడి వేదపండితులు నూతన సంవత్సరం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్, భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణగారిలను ఆశీర్వదించారు.
Date : 01-01-2022 - 10:42 IST -
Movie Postponed:RRR సినిమా వాయిదా!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జంటగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని, అయితే విడుదల తేదీని వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలిపింది.
Date : 01-01-2022 - 6:56 IST -
Pulwama attack: పాలుపంచుకున్న చివరి టెర్రరిస్టు ఎన్కౌంటర్
పుల్వామా ఉగ్రదాడి భారత దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఆనాటి ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కాగా, పుల్వామా ఉగ్రదాడితో సంబంధం ఉన్న చివరి టెర్రరిస్టును కూడా భారత బలగాలు కాల్చి చంపాయి. పుల్వామా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గతంలో పలు ఎన్ కౌంటర్లలో సైన్యం తుదముట్టించింది. తాజా ఘటనతో పుల్వామా ముష్కరులు అందరినీ అంతమొందించినట్టయింది. కశ్మీర్ లోని
Date : 01-01-2022 - 5:22 IST -
Tamil Nadu: కఠిన ఆంక్షలు విధించిన ప్రభుత్వం
తమిళనాడులో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జనవరి 1నుండి 10 వరకు ఆంక్షలు విధించింది. శుక్రవారం ఒక తమిళనాడు లోనే 76 ఓమిక్రాన్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పబ్లిక్ మీటింగులు, ఈవెంట్లను ఇదివరకే రద్దు చేసిన నేపథ్యంలో రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, ఇతర కమర్షియల్ స్థలాల్లో 50 శాతం మందికి మించకూడదని ఆదేశించింది. 8వ తరగతి వరకు విద్యార్థు
Date : 01-01-2022 - 5:02 IST -
Textiles: జీఎస్టీ పెంపు నిర్ణయం పై వెనక్కి తగ్గిన కేంద్రం
టెక్సటైల్స్ పై 5 శాతం ఉన్న జీఎస్టీ ని 12 శాతానికి పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జనవరి 1 నుండి టెక్సటైల్స్ పై 12 శాతం జీఎస్టీ అమలు కావాల్సి ఉండగా ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆధ్వర్యంలో జరిగిన 46వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ పెంపు సరికాదని దేశవ్యాప్తంగా న
Date : 01-01-2022 - 4:24 IST -
NewYear: 2022 భేష్ అంటోన్న సర్వేలు!
గత ఏడాది కంటే కొత్త ఏడాది 2022 బాగుంటుందని ప్రతి నలుగురిలో ముగ్గురు ఆశావహదృక్పదంతో ఉన్నారు. ఆ మేరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన సర్వే స్పష్టం చేస్తోంది.
Date : 01-01-2022 - 4:07 IST -
Telangana & Andhra: ఒక్కరోజులో 296కోట్లు తాగేశారు
నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.172కోట్ల మద్యం విక్రయించగా.. ఏపీలో రూ.124.10కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఇరు రాష్ట్రాల ఆబ్కారీ శాఖలు తెలిపాయి. ఏపీలో రోజువారీ అమ్మకాలు సాధారణంగా రూ. 70-75 కోట్లు ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా అదనంగా రూ. 50 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి
Date : 01-01-2022 - 3:41 IST -
Anandayya: హైకోర్టుకి ఆనందయ్య.. మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ!
కృష్ణపట్నం ఆనందయ్య తన మందు పంపిణీకి అనుమతి ఇవ్వాలంటూ ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. కరోనా రెండవ దశలో కృష్ణపట్నం ఆనందయ్య ఔషదం కోసం వేల సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు.
Date : 01-01-2022 - 3:07 IST -
Kashmir: గుప్కార్ నేతల హౌస్ అరెస్ట్
పునర్విభజన కమిషన్ సిఫారసులకు వ్యతిరేకంగా గుప్కార్ నేతలు ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని జమ్ముకశ్మీర్ పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, సీపీఎం నేత ఎంవై తరిగామిలతో పాటు ఇతర నేతలందరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. అయితే తమ శాంతియుత నిరసనలను అణచివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని
Date : 01-01-2022 - 3:02 IST -
India: రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం.. రూ.20,900 కోట్లు విడుదల
రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను వర్చువల్గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మోడీ మాట్లాడారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమయ్యాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హలైన రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా రూ.6వేలు అంది
Date : 01-01-2022 - 2:18 IST -
Corona: ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు
ఇజ్రాయెల్ లో కొత్త వేరియెంట్ కలవరపెడుతుంది. ఇప్పటికే కరోనాలో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి ప్రపంచాన్ని ఆందోళన పరుస్తున్న నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ఈ కొత్త వైరస్ మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. ‘ఫ్లోరోనా’ తొలి కేసు నమోదైంది. కరోనాతో పాటు ఫ్లూ కూడా సోకే డబుల్ ఇన్ఫెక్షన్ ను ఫ్లోరోనా అని పిలుస్తున్నారు. ప్రసవం కోసం రాబిన్ మెడికల్ సెంటర్ లో చేరిన మహిళకు ఈ డబుల్ ఇన్ ఫెక్షన్ సోకి
Date : 01-01-2022 - 2:06 IST -
Guntur: దేశ విభజనకు కారకుడైన జిన్నా పేరును తొలగించాలి- బీజేపీ
గుంటూరులోని జిన్నా టవర్ పేరును మార్చాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీరాజు డిమాండ్ చేశారు. దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండటం బాధాకరం అని అన్నారు. వెంటనే జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సహా పలువురు బీజేపీ నాయకులు సోమువీరాజు
Date : 01-01-2022 - 1:51 IST -
CBI chargesheet: 947.70 కోట్ల మోసం.. రఘు రామకృష్ణంరాజుపై చార్జిషీట్!
947.70 కోట్ల రుణ మోసానికి పాల్పడినందుకుగానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘు రామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్-బారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చార్జిషీట్ దాఖలు చేసింది.
Date : 01-01-2022 - 1:34 IST -
Corona: రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
ఒమైక్రాన్ కారణంగా రాష్ట్రాల్లో కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా అప్రమత్తమైంది. రోజంతా పనిచేసేలా యాంటీజెన్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, నర్సింగ్ హోంలు, జిల్లా ఆస్పత్రులు, పీహెచ్సీలు తదితర విభిన్న ప్రదేశాల్లో వీటిని నెలకొల్పి వైద్య, ఆరోగ్య సిబ్బందిని నియమించాలని రాష్ట్రాలన
Date : 01-01-2022 - 1:18 IST -
Andhra Pradesh: పింఛన్ల ను రూ.2,250 నుంచి రూ.2,500కి పెంచిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, హెచ్ఐవీ పేషెంట్లు, నేతన్నలు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, చర్మకారులకు ఇచ్చే సామాజిక పింఛన్లను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇప్పటిదాకా నెలకు రూ.2,250 ఇస్తుండగా.. నూతన సంవత్సర కానుకగా ఇవాళ్లి నుంచి రూ.2,500కు పెంచింది. ఈ పెంపుతో ప్రభుత్వం నెలకు పెన్షన్లపై రూ.1,570 కోట్లు ఖర్చు చేయనుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఇవ
Date : 01-01-2022 - 12:49 IST -
Corona: ఈ లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోండి
భారత్ లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. రోజు వారీ కేసులు 20 వేలను దాటేశాయి. డెల్టా వేరియంట్ కు తోడు ఒమిక్రాన్ వేరియంట్ కూడా పంజా విసురుతోంది. రాబోయే రోజుల్లో కరోనా కేసుల తీవ్రత బీభత్సంగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తలనొప్పి, గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాసన, రుచి కోల్పోవడం, అలసట,
Date : 01-01-2022 - 12:27 IST