India: రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయం.. రూ.20,900 కోట్లు విడుదల
- By hashtagu Published Date - 02:18 PM, Sat - 1 January 22
రైతులకు ప్రతి ఏటా అందించే పెట్టుబడి సాయం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధులను వర్చువల్గా విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పథకంలోని పలువురు లబ్ధిదారులతో మోడీ మాట్లాడారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20,900 కోట్లు జమయ్యాయి.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హలైన రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందిస్తోంది కేంద్రం. దీనిని మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున విడుదల చేస్తూ వస్తోంది. ప్రస్తుతం 10వ విడత నిధులను ఖాతాల్లో జమ చేసింది కేంద్రం.
Related News
BRS Leaders: రేవంత్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ : బీఆర్ఎస్ నేతలు
BRS Leaders: బీఆర్ఎస్ నేతలు దేవిప్రసాద్, చిరుమళ్ల రాకేష్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ ఎం .శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. గత పదిహేను రోజులుగా రైతాంగం తీవ్ర ఆందోళన లో ఉందని, రైతులకు భరోసా ఇచ్చే ప్రభుత్వం రాష్ట్రం లో లేదని వారు మండిపడ్డారు. రైతు భరోసా కింద పెంచిన మొత్తం రైతులకు ఇస్తామని చెప్పి రైతు బంధు సాయం తోనే ప్రభుత్వం సరిపెట్టింది అది కూడా మొత్తం ఇవ్వలేదని