JEE Main Result: జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ సెషన్కు సంబంధించిన జేఈఈ మెయిన్ ఫలితాలను విడుదల చేసింది.
- By Gopichand Published Date - 08:32 AM, Thu - 25 April 24
JEE Main Result: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏప్రిల్ సెషన్కు సంబంధించిన జేఈఈ మెయిన్ ఫలితాల (JEE Main Result)ను విడుదల చేసింది. NTA jemain.nta.ac.in అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాలతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్, ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్స్ లిస్ట్, స్టేట్ వైజ్ టాపర్ లిస్ట్, ఫైనల్ ఆన్సర్ కీలను కూడా NTA విడుదల చేసింది. ఈ ఏడాది జేఈఈ మెయిన్ను జనవరి, ఏప్రిల్లో 2 రౌండ్లలో నిర్వహించారు. రెండు రౌండ్లలో జేఈఈ మెయిన్స్కు హాజరైన విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ కోసం తమ ఉత్తమ స్కోర్ను ఉపయోగించవచ్చు. మీ ఫలితాన్ని రిజల్ట్ చెక్ చేయడానికి మీకు మీ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ అవసరం.
ఈసారి జేఈఈ మెయిన్లో 56 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. అందులో ఇద్దరు బాలికలు కర్ణాటకకు చెందిన సాన్వీ జైన్, ఢిల్లీకి చెందిన షైనా సిన్హా ఉన్నారు. మిగిలిన వారు 100 పర్సంటైల్ సాధించిన వారిలో బాలురు ఉన్నారు. ఈ సంఖ్య గత సంవత్సరం కంటే ఎక్కువ. 2023 సంవత్సరంలో 43 మంది విద్యార్థులు మాత్రమే 100 పర్సంటైల్ సాధించారు. అయితే ఈ ఏడాడి 100 పర్సంటైల్ సాధించిన 56 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది ఉన్నారు. ఇందులో తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు.
Also Read: Kodad Road Accident : లారీని ఢీకొట్టిన కారు.. ఆరుగురి దుర్మరణం
జేఈఈ మెయిన్ 2024 సెషన్ 2 ఫలితాన్ని ఎలా తనిఖీ చేయాలి
– ముందుగా NTA jeemain.nta.ac.in అధికారిక వెబ్సైట్కి వెళ్లండి.
– జేఈఈ (మెయిన్) 2024 సెషన్-2 స్కోర్ కార్డ్ని యాక్సెస్ చేయడానికి లింక్పై క్లిక్ చేయండి.
– ఇప్పుడు అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ వంటి అవసరమైన వివరాలను పూరించండి. సమర్పించండి.
-మీరు స్క్రీన్పై మీ ఫలితాన్ని చూడటం ప్రారంభిస్తారు.
We’re now on WhatsApp : Click to Join
భారతదేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ తీసుకోవాలనుకునే విద్యార్థులకు జేఈఈ మెయిన్ ఒక ముఖ్యమైన పరీక్ష అని తెలిసిందే. జేఈఈ అడ్వాన్స్డ్ కోసం మీరు మంచి స్కోర్లతో జేఈఈ మెయిన్లో అర్హత సాధించాలి.
Related News
Equity Shares: కంపెనీ షేర్లను ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చిన ప్రముఖ కంపెనీ
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు అనుకోని బహుమతిని అందించింది.