Five students Drown: నదిలో ఈతకు దిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ఒకరి మృతి
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు (Five students Drown) గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.
- By Gopichand Published Date - 06:00 PM, Fri - 16 December 22
ఏపీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని యనమలకుదురు సమీపంలోని కృష్ణా నదిలో ఈతకు దిగిన ఐదుగురు విద్యార్థులు (Five students Drown) గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మరో నలుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందం ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు. తొలుత ఒక విద్యార్థి నీటిలో మునిగిపోతుండగా అతని కాపాడటానికి ప్రయత్నించే క్రమంలో నలుగురు విద్యార్థులు నీటమునిగారని (Drown) ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. బాధితులంతా విజయవాడ పడమట ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది విద్యార్థుల ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Also Read: Delhi Incident : విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్..
Related News
AP : ఏపిలో మనం చరిత్ర సృష్టించబోతున్నాం: ఐప్యాక్ టీంతో సీఎం జగన్
CM Jagan: సిఎం జగన్ విజయవాడ(Vijayawada)లోని ఐప్యాక్ కార్యాలయా(IPAC office)ని ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఐప్యాక్ బృందంతో(IPAC team) మాట్లాడుతూ.. ఏపిలో వైసీపీ(YCP) కొత్త చరిత్ర సృష్టించబోతోందని అన్నారు. ఎన్నికల తరువాత తొలి సారి ఫలితాల పై స్పందించారు. 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. 22 ఎంపీ సీట్లు గెలవబోతున్నట్లు వెల్లడించారు. We’re now on WhatsApp. Click to Join. అంతేకాదు.. ప్రశాంత్ కిషోర్ అంచనా వేయని