HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >China Built A Large Military Base On Myanmar Coco Island

China-Myanmar :చైనా టార్గెట్ లో వైజాగ్, చెన్నై.. మయన్మార్ లో మిలిటరీ బేస్

China-Myanmar : మయన్మార్‌ ఆర్మీ చైనాతో చేతులు కలిపింది.మయన్మార్‌కు కుడివైపున బంగాళాఖాతంలో ఉన్న కోకో ద్వీపాన్ని చైనాకు అప్పగించింది. అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు డ్రాగన్ కు పర్మిషన్ ఇచ్చింది. 

  • By Pasha Published Date - 01:54 PM, Sun - 18 June 23
  • daily-hunt
China Myanmar
China Myanmar

China-Myanmar : మయన్మార్‌ ఆర్మీ చైనాతో చేతులు కలిపింది.

మయన్మార్‌కు కుడివైపున బంగాళాఖాతంలో ఉన్న కోకో ద్వీపాన్ని చైనాకు అప్పగించింది. 

అక్కడ మిలిటరీ బేస్ ఏర్పాటు చేసుకునేందుకు డ్రాగన్ కు పర్మిషన్ ఇచ్చింది. 

దీనిపై ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 

ఎందుకంటే కోకో ద్వీపం నుంచి భారత్ లోని చెన్నై, వైజాగ్, కోల్ కతా, బాలాసోర్ తీర ప్రాంతాలను చైనా ఈజీగా టార్గెట్ చేయగలుగుతుంది.

కోల్ కతా, చెన్నై, బాలాసోర్, వైజాగ్ లపై గురి 

చైనా లోన్ ట్రాప్ చాలా డేంజరస్ గా ఉంటుంది. మయన్మార్ కూడా ఇందులో ఇరుక్కుంది. 2021లో మయన్మార్ లో ఆర్మీ తిరుగుబాటు చేసి ఆంగ్ సాన్ సూకీని జైలులో వేసింది. సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లైంగ్ ఆధ్వర్యంలో మయన్మార్‌ లో సైనిక పాలన మొదలైంది.  దీన్ని పాశ్చాత్య దేశాలు వ్యతిరేకించాయి. మయన్మార్ ను(China-Myanmar) ఒంటరి చేశాయి. అయితే ఈ అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకుంది. మయన్మార్‌కు గత 2 ఏళ్లలో దాదాపు రూ.32వేల కోట్ల లోన్ ఇచ్చింది. ఇందుకు ప్రతిఫలంగా  చైనా-మయన్మార్-బంగ్లాదేశ్ బెల్ట్ రోడ్  కారిడార్ నిర్మాణానికి సహకరించాలనే షరతు పెట్టింది. భారత్ లోని  కోల్ కతా, చెన్నై, బాలాసోర్, వైజాగ్ తీర ప్రాంతాలకు చేరువగా ఉండే బంగాళాఖాతంలోని  కోకో ద్వీపంలో సైనిక స్థావరం ఏర్పాటు చేసే ఛాన్స్ ఇవ్వమని  మయన్మార్‌  సైనిక పాలకులను చైనా కోరింది. ఇప్పటికే కోకో ద్వీపంలో విమాన సౌకర్యం కోసం చైనా రన్‌వే నిర్మించిందని ఉపగ్రహ చిత్రాలను బట్టి తెలుస్తోంది.  ఈ ద్వీపంలో దాదాపు 1500 మంది చైనా సైనిక సిబ్బంది కోసం కొత్త షెడ్‌లు, బ్యారక్‌లు నిర్మించారని సమాచారం.

Also read : China 41 Satellites : ఒకే రాకెట్ తో 41 శాటిలైట్ల ప్రయోగం.. చైనా మరో రికార్డ్

భారత్ ఆందోళనకు కారణాలు ఇవీ.. 

  • మయన్మార్ లోని కోకో ద్వీపంలో చైనా ఆర్మీ బేస్ ఏర్పాటుపై భారత్ ఆందోళన చెందుతోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అవేమిటంటే..
  • ఒడిశాలోని బాలాసోర్‌లో న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ ఫైరింగ్ రేంజ్, సాంప్రదాయిక క్షిపణి పరీక్షా ఫైరింగ్ రేంజ్ ఉన్నాయి. ఇది కోకో ద్వీపం ఉన్న అక్షాంశంలోనే ఉంది.
  • ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం కూడా.. సూటిగా  కోకో ద్వీపం ఉన్న అక్షాంశంలోనే ఉంది. దీంతో కోకో ద్వీపం నుంచి ఆ ప్రాంతంపై కూడా చైనా ఇంటెలీజెన్స్ కొనసాగొచ్చు.
  • విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న వ్యూహాత్మక సైనిక ఆస్తులపై కోకో ద్వీపం నుంచి  చైనా నిఘా పెట్టగలదు. అక్కడి నుంచి భారతదేశం యొక్క అణు జలాంతర్గాముల కదలికను చైనా పర్యవేక్షించే ఛాన్స్ ఉంది.
  • భారతదేశం యొక్క బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే జలాంతర్గాములు కూడా విశాఖపట్నం తీరంలో ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో భారత సైన్యం కదలికలపై అదనపు ఇన్ పుట్స్ పొందేందుకు కోకో ద్వీపాన్ని ఒక వేదికగా చైనా వాడుకోనుంది.

కోకో ద్వీపం.. ఇండియా బార్డర్  

కోకో ద్వీపం అనేది బంగాళాఖాతంలో ఉన్న చిన్న ద్వీపాల సమూహం. ఇది మయన్మార్ (బర్మా) అధికార పరిధిలో ఉంది. ఇది బంగాళాఖాతం, అండమాన్ సముద్రం సరిహద్దులో ఉంది. భారతదేశంలోని అండమాన్, నికోబార్ దీవులకు ఉత్తరాన ఇది ఉంది. పరిపాలనాపరంగా ఇది బర్మాలోని యాంగోన్ డివిజన్‌లో భాగం. కోకో ద్వీపం ఉత్తర అండమాన్ ద్వీపం నుంచి కేవలం 20 కి.మీలో దూరంలో ఉంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Balasore
  • bay of bengal
  • billions
  • bribed
  • china
  • China-Myanmar
  • Coco Island
  • india
  • large military base
  • myanmar
  • odisha
  • Visakhapatnam city

Related News

Rangareddy

Rangareddy: దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా రంగారెడ్డి

Rangareddy: రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నగరానికి సమీపంగా ఉండడం వల్ల ఇది ఆర్థిక, సాంకేతిక, పారిశ్రామిక హబ్‌గా మారింది. గచ్చిబౌలి, మాధాపూర్, నానకరంరెడ్డి, షమ్షాబాద్, పటాంచెరు పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ఫార్మా కంపెనీలు స్థాపించబడ్డాయి

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

  • India vs Pakistan

    India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

  • Team India Schedule

    Australia Beat India: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోర ఓట‌మి!

Latest News

  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

  • Sanju Samson: సంజూ శాంసన్ బ్యాటింగ్‌తో ఎందుకు ఆడుకుంటున్నారు?

  • IND vs AUS: నాలుగో టీ20లో భార‌త్ ఘ‌న‌విజ‌యం.. 2-1తో భార‌త్ ముంద‌డుగు!

  • Laptop: మీరు ల్యాప్‌టాప్ వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

  • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd