Earthquake: కొత్త సంవత్సరం రోజున కంపించిన భూమి
కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంప తీవ్రతను అంచనా వేసింది. భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం..
- By Gopichand Published Date - 07:13 AM, Sun - 1 January 23
కొత్త సంవత్సరం ప్రారంభం రోజున ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో అర్థరాత్రి భూకంపం (Earthquake) సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ భూకంప తీవ్రతను అంచనా వేసింది. భూకంప తీవ్రత 3.8గా నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అయితే ఈ ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. ఆదివారం (01-01-2023) తెల్లవారుజామున 1:19 గంటలకు హర్యానాలోని ఝజ్జర్ వాయువ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. దీని లోతు భూమికి 5 కి.మీ. కేంద్రం నుంచి అందిన రీడింగ్ ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
అంతకుముందు నవంబర్ 12న భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4 గా ఉంది. ఇది రాత్రి 7:57 గంటలకు నేపాల్లో వచ్చింది. భూకంపం లోతు భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అనేది దేశంలో భూకంప కార్యకలాపాలను పర్యవేక్షించడానికి భారత ప్రభుత్వం నోడల్ ఏజెన్సీ. ఈ ఏజెన్సీ ప్రకారం.. రోహ్తక్-ఝజ్జర్ గుండా వెళుతున్న మహేంద్రగఢ్-డెహ్రాడూన్ ఫాల్ట్ లైన్ దగ్గర తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి దీనిపై నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రత్యక్షంగా చూస్తుంది. ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పుడు, హర్యానాలో భూమికి కేవలం 5 కిలోమీటర్ల దిగువన ప్రకంపనలు నమోదయ్యాయి. దీని కారణంగా చాలా ప్రాంతాల్లో భూకంపం సంభవించినట్లు ప్రజలు భావించారు.
Earthquake of Magnitude:3.8, Occurred on 01-01-2023, 01:19:42 IST, Lat: 28.71 & Long: 76.62, Depth: 5 Km ,Location: 12km NNW of Jhajjar, Haryana for more information Download the BhooKamp App https://t.co/QVSUrTSmuX pic.twitter.com/SAgjRl6hNo
— National Center for Seismology (@NCS_Earthquake) December 31, 2022
Related News
Pakistan Reaction: కేజ్రీవాల్ విడుదలతో పాకిస్థాన్ లో సంబురాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా డాన్ ఈ వార్తను ప్రచురించింది.కేజ్రీవాల్ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.