Karnataka: కర్ణాటక పీఠంపై నేడు కాంగ్రెస్ అధిష్టానం భేటీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..?
కర్ణాటక (Karnataka) కొత్త ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన సమావేశంలో ఎలాంటి ఫలితం లేకపోవడంతో నేడు మరోసారి దీనిపై చర్చ జరగనుంది.
- By Gopichand Published Date - 07:43 AM, Tue - 16 May 23
కర్ణాటక (Karnataka) కొత్త ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన సమావేశంలో ఎలాంటి ఫలితం లేకపోవడంతో నేడు మరోసారి దీనిపై చర్చ జరగనుంది. ఈ రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ల పేర్లు కూడా ముందు వరుసలో ఉన్నాయి. కాగా, మంగళవారం ఢిల్లీలోని మల్లికార్జున్ ఖర్గే ఇంటికి డీకే శివకుమార్ చేరుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి శివకుమార్ను, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ఢిల్లీకి పిలిచి చర్చలు జరిపింది. సిద్ధరామయ్య సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఆరోగ్య కారణాల వల్ల శివకుమార్ పర్యటనను రద్దు చేసుకున్నారు. అయితే ఆయన సోదరుడు డీకే సురేష్ మాత్రం ఖర్గేను కలిశారు. అదే సమయంలో సోమవారం జరిగిన సమావేశం అనంతరం రణదీప్ సింగ్ సూర్జేవాలా విలేకరులతో మాట్లాడుతూ.. పరిశీలకులు తమ నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పించారు. పార్టీ రాష్ట్ర నేతలు, ఇతర సీనియర్ నేతలను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామన్నారు.
Also Read: Jr NTR: చంద్రబాబు వ్యూహంలో జూనియర్! భలే ట్విస్ట్
లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు
లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పరిశీలకులతో జరిగిన సమావేశంలో కొందరు శాసనసభ్యులు ముఖ్యమంత్రి పదవిపై తమ అభిమతాన్ని వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తమ ఎంపికను అందరి ముందు చెప్పేందుకు ఎమ్మెల్యేలు సంకోచించినా.. ఆ తర్వాత రాతపూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరారు.
కాంగ్రెస్ అద్భుత ప్రదర్శన
రాష్ట్రంలోని 224 మంది సభ్యుల అసెంబ్లీకి మే 10న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాల్లో అఖండ విజయం సాధించగా, అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి), మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ (సెక్యులర్) వరుసగా 66, 19 సీట్లు గెలుచుకుంది.
Related News
INDIA Alliance: జూన్ 4న బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు
త్వరలో భారత కూటమి అధికారంలోకి వస్తుందని, బీజేపీ ప్రభుత్వానికి వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చిందని కూటమి భావిస్తుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో కలిసి లక్నోలో సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు