PM Modi: మోడీపై రక్షణ మంత్రి ప్రశంసలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా అక్కడ ఇరుక్కున్న వేలాది మంది భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది.
- By Praveen Aluthuru Published Date - 01:53 PM, Mon - 15 May 23
PM Modi: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా అక్కడ ఇరుక్కున్న వేలాది మంది భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. ప్రధాని మోడీ చొరవ తీసుకుని ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులను తరలించడంలో ప్రధాని మోదీ కీలకపాత్ర పోషించారని, భారతదేశం తలమానికంగా నిలిచేందుకు ప్రధాని ఎప్పుడూ కృషి చేస్తారని ఆయన అన్నారు.
ఔరంగాబాద్లో జరిగిన మహారాణా ప్రతాప్ మహాసమ్మేళన్లో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ…మరే దేశం చేయలేని పనిని చేసిన ప్రధాని మోదీని చూసి నేను గర్వపడుతున్నాను. మహారాణా ప్రతాప్ శౌర్యం, త్యాగం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోడీని గుర్తు చేసుకున్నారు. ఆత్మగౌరవం విషయంలో మహారాణా ప్రతాప్ ఎప్పుడూ రాజీ పడలేదన్నారు.అలాగే మోడీ కూడా ఎప్పుడూ రాజీ పడడంటూ ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. 2014 కు ముందు రూ.900 కోట్లుగా ఉన్న భారత ఆయుధ ఎగుమతులు మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో రూ.16,000 కోట్లకు పైగా పెరిగాయని రాజ్ నాథ్ చెప్పారు. దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు మోదీ కృషి ఉంటుందని, అందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ మాట్లాడారని రాజ్నాథ్ తెలిపారు. అవసరమైనప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్తో కూడా మాట్లాడారని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. యుక్రెయిన్లో చిక్కుకున్న 22,000 పైగా విద్యార్థులను రక్షించి ఇంటికి తిరిగి వచ్చేలా చొరవ చూపారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డలను కాపాడాలని ప్రధాని మోదీని కోరారని, దానికి ప్రధాని చొరవ తీసుకుని తమ బిడ్డలను ఇంటికి చేర్చారని తెలిపారు.
Read More: Karnataka 2023 : కర్ణాటక కాంగ్రెస్ లో చీలిక? కొత్త CBI బాస్ ఎఫెక్ట్!
Related News
Asaduddin Owaisi : కండోమ్స్ ఎక్కువగా ఉపయోగించేది ముస్లింలే – ఓవైసీ
ముస్లీంలు ఎక్కువ మంది పిల్లలను కంటారని ప్రజలకు ఎందుకు అబద్దం చెబుతున్నారు