HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rajnath Claims Modi Spoke To Putin And Zelenskyy

PM Modi: మోడీపై రక్షణ మంత్రి ప్రశంసలు

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా అక్కడ ఇరుక్కున్న వేలాది మంది భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది.

  • Author : Praveen Aluthuru Date : 15-05-2023 - 1:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pm Modi (2)
Pm Modi (2)

PM Modi: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధం కారణంగా అక్కడ ఇరుక్కున్న వేలాది మంది భారతీయులను భారత ప్రభుత్వం వెనక్కి రప్పించింది. ప్రధాని మోడీ చొరవ తీసుకుని ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఉక్రెయిన్ నుండి భారతీయ విద్యార్థులను తరలించడంలో ప్రధాని మోదీ కీలకపాత్ర పోషించారని, భారతదేశం తలమానికంగా నిలిచేందుకు ప్రధాని ఎప్పుడూ కృషి చేస్తారని ఆయన అన్నారు.

ఔరంగాబాద్‌లో జరిగిన మహారాణా ప్రతాప్ మహాసమ్మేళన్‌లో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ…మరే దేశం చేయలేని పనిని చేసిన ప్రధాని మోదీని చూసి నేను గర్వపడుతున్నాను. మహారాణా ప్రతాప్ శౌర్యం, త్యాగం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని మోడీని గుర్తు చేసుకున్నారు. ఆత్మగౌరవం విషయంలో మహారాణా ప్రతాప్ ఎప్పుడూ రాజీ పడలేదన్నారు.అలాగే మోడీ కూడా ఎప్పుడూ రాజీ పడడంటూ ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. 2014 కు ముందు రూ.900 కోట్లుగా ఉన్న భారత ఆయుధ ఎగుమతులు మోదీ ప్రధానిగా ఉన్న సమయంలో రూ.16,000 కోట్లకు పైగా పెరిగాయని రాజ్ నాథ్ చెప్పారు. దేశాన్ని స్వావలంబనగా మార్చేందుకు మోదీ కృషి ఉంటుందని, అందుకు మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో ప్రధాని మోదీ మాట్లాడారని రాజ్‌నాథ్ తెలిపారు. అవసరమైనప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌తో కూడా మాట్లాడారని కేంద్ర మంత్రి గుర్తు చేసుకున్నారు. యుక్రెయిన్‌లో చిక్కుకున్న 22,000 పైగా విద్యార్థులను రక్షించి ఇంటికి తిరిగి వచ్చేలా చొరవ చూపారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ బిడ్డలను కాపాడాలని ప్రధాని మోదీని కోరారని, దానికి ప్రధాని చొరవ తీసుకుని తమ బిడ్డలను ఇంటికి చేర్చారని తెలిపారు.

Read More: Karnataka 2023 : క‌ర్ణాట‌క కాంగ్రెస్ లో చీలిక‌? కొత్త CBI బాస్ ఎఫెక్ట్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 20000 students
  • Maharana Pratap Maha Sammelan
  • modi
  • putin
  • Rajnath singh
  • Zelenskyy

Related News

    Latest News

    • అరటిపండు తింటే లాభమా నష్టమా..డాక్టర్ చెప్పిన రహస్యాలు ఇవే

    • సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

    • ‘వీబీ జీ రామ్‌ జీ’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    • రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

    • తిరిగి సాధారణ స్థితికి ఇండిగో కార్యకలాపాలు.. సీఈఓ ప్రకటన

    Trending News

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

      • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

      • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

      • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

      • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd