HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Rahul Priyanka Ride Bikes In Voter Adhikar Yatra

Bihar : ‘ఓటర్ అధికార్ యాత్ర’లో రాహుల్‌, ప్రియాంక బైక్ రైడ్‌

ఈ రోజు ముజఫర్‌పూర్‌లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు.

  • By Latha Suma Published Date - 03:54 PM, Wed - 27 August 25
  • daily-hunt
Rahul, Priyanka ride bikes in 'Voter Adhikar Yatra'
Rahul, Priyanka ride bikes in 'Voter Adhikar Yatra'

Bihar : బీహార్ రాజకీయాల్లో వేడి రాజుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల హక్కులను రక్షించేందుకు ‘ఇండియా’ కూటమి తరఫున నిర్వహిస్తున్న ఈ యాత్రలో ఓ మామూలు దృశ్యం అసాధారణ ప్రజాదరణ పొందింది. ఈ రోజు ముజఫర్‌పూర్‌లో జరిగిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ స్వయంగా మోటార్ సైకిల్ నడిపారు. ఆశ్చర్యకరంగా ఆయన వెంటనే బైక్ పై ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూర్చున్నారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై యాత్రలో పాల్గొంటూ ముందుకు సాగారు. ఈ అరుదైన దృశ్యాన్ని కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. వీరి సరసన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ సహా మరికొంతమంది కూటమి నాయకులు కూడా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ యాత్రకు కారణంగా, బీహార్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది పేర్లను తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

Read Also: Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు యాత్ర చేపట్టినట్టు పేర్కొంటున్నారు. ‘ఓటర్ అధికార్ యాత్ర’ను ఆగస్టు 17న ససారామ్ నుండి ప్రారంభించారు. మొత్తం 1,300 కిలోమీటర్ల మేర కొనసాగనున్న ఈ యాత్ర, సెప్టెంబర్ 1న ముగియనుంది. ప్రతి నగరంలో, పట్టణంలో, గ్రామాల్లో ప్రజలతో ప్రత్యక్షంగా కలిసేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఈ యాత్రను ఒక మాధ్యమంగా మార్చారు. నిన్న దర్భంగాలో జరిగిన భారీ బహిరంగ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ గాంధీ, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ముఖ్యంగా ఓటు హక్కును రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని హితవు పలికారు. బీజేపీ అధికార దుర్వినియోగంతో ఓట్లను దొంగిలించే ప్రయత్నాలు చేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ యాత్ర ద్వారా, యువతతో పాటు సాధారణ ప్రజానీకం కూడా రాజకీయ చైతన్యాన్ని కలిగి, ఎన్నికల ప్రక్రియ పట్ల ఆసక్తితో ముందుకు రావాలని కాంగ్రెస్ ఆశిస్తోంది. రాహుల్‌, ప్రియాంక బైక్ రైడ్ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నంగా మారినట్లు కనిపిస్తోంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నెలలే మిగిలి ఉండటంతో, ఈ యాత్ర రాజకీయంగా ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి. కానీ ప్రజల్లో మాత్రం ఈ యాత్ర పట్ల పెరుగుతున్న ఆసక్తి, రాజకీయ ఉత్కంఠకు దారితీస్తోంది.

🔥 pic.twitter.com/jdRkMyAOiI

— Congress (@INCIndia) August 27, 2025

Read Also: Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • Bihar Elections
  • congress
  • INDIA alliance
  • mk stalin
  • Priyanka gandhi
  • rahul gandhi
  • Revant Reddy
  • Tejashwi Yadav
  • Voter Adhikar Yatra

Related News

Why the eight-year delay? ..Chidambaram's response on the Centre's reduction in GST rates..

Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.

  • CM Revanth Reddy

    Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • Let's develop Telangana with Rising 2047: CM Revanth Reddy

    CM Revanth Reddy : రాహుల్ గాంధీని ప్రధానిగా చేస్తాం.. కేరళలో రగల్చిన రేవంత్ రెడ్డి..!

Latest News

  • Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Telangana: హైకోర్టులో సంచలనం.. పిటిషనర్ ప్రవర్తనతో విచారణ నుంచి తప్పుకున్న జడ్జి

  • Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

  • Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

  • Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd