HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Courts Do Not Have That Power Bjp Ruled States Argue In Supreme Court

Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు

శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి.

  • By Latha Suma Published Date - 03:15 PM, Wed - 27 August 25
  • daily-hunt
Courts do not have that power: BJP-ruled states argue in Supreme Court
Courts do not have that power: BJP-ruled states argue in Supreme Court

Pending Bills Issue : రాష్ట్రపతి, గవర్నర్‌లకు రాజ్యాంగం ద్వారా కల్పించిన అధికారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం తగదని బీజేపీ పాలిత రాష్ట్రాలు స్పష్టంగా పేర్కొన్నాయి. శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును సంప్రదిస్తూ, శాసనసభలు పంపే బిల్లులను ఆమోదించేందుకు తానెంతకాలం సమయం తీసుకోవచ్చో తెలపాలని అభిప్రాయం కోరారు. దాంతో ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎ.ఎస్. చంద్రూర్కర్‌లు సభ్యులుగా ఉన్నారు.

Read Also: BJP : నన్ను 11 ఏళ్లుగా ఫుట్‌బాల్‌లా ఆడుకున్నారు: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, ఒడిశా రాష్ట్రాలు తమ వాదనలను ధర్మాసనం ముందు వినిపించాయి. మహారాష్ట్ర తరఫున ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు లేదా రాష్ట్రపతికే తుది నిర్ణయం చెప్పే అధికారం ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం బిల్లులను ఆమోదించడం, తిరస్కరించడం, లేదా వాటిని తమ వద్ద నిలిపివేయడం రాష్ట్రపతికి లేదా గవర్నర్‌కు మాత్రమే సాధ్యం. కోర్టులకు అలాంటి అధికారం లేదు. కోర్టులు రాజ్యాంగాన్ని తమంతట తాముగా మార్చలేవు. ఈ వ్యవస్థను సమర్థంగా నడిపించేందుకు ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందని సాల్వే అన్నారు. ఇక, బిల్లుల ఆమోదానికి గడువు విధించడం కోర్టుల పరిధిలోకి రాదని ఆయన స్పష్టంగా చెప్పారు. రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయం తీసుకునే ముందు రాజకీయ సంప్రదింపులు, విశ్లేషణ జరుగుతాయని, ఇది ఒక పరిపక్వమైన ప్రాసెస్ అని పేర్కొన్నారు.

ఈ క్రమంలో ధర్మాసనం ఆర్థిక బిల్లుల విషయంలో ప్రశ్నలు సంధించింది. ముఖ్యంగా వాటిని నిరవధికంగా నిలిపితే పరిస్థితి ఎలా ఉంటుందనే అంశాన్ని ప్రశ్నించగా, ఆర్థిక బిల్లులకు ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని, వాటిపై నిర్ణయం వేగంగా తీసుకోవడం అవసరమని సాల్వే సమాధానమిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైన అంశం కావడంతో, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ, న్యాయవర్గాలు ఈ కేసుపై ఆసక్తిగా చూస్తున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభిప్రాయ కోరిన తీరు, దానిపై ధర్మాసనం స్పందన రాజ్యాంగ పరిపాలనలో కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు తదుపరి విచారణకు తేది ఇంకా ప్రకటించకపోయినా, సుప్రీంకోర్టు తీర్పు భారత రాజకీయ వ్యవస్థ, రాష్ట్రపతి-గవర్నర్ వ్యవహారాల్లో కీలక మార్పులకు దారితీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read Also: India: అమెరికాకు వ్య‌తిరేకంగా భార‌త్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Constitution of India
  • Governors Powers
  • Harish Salve
  • judicial review.
  • Legislative Assembly
  • Pending Bills Issue
  • President Droupadi Murmu
  • State Bills
  • Supreme Court

Related News

Four years of locality mandatory for medical students: Supreme Court

Telangana : వైద్య విద్యార్థులకు నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి: సుప్రీంకోర్టు

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సుప్రీంకోర్టు పూర్తిగా సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం, తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి మరియు డివిజన్ బెంచ్ ఇచ్చిన పూర్వపు ఉత్తర్వులను పక్కన పెట్టింది. దీంతో, స్థానికత నిబంధనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి బలమైన మద్దతు లభించింది.

  • E20 Fuel Policy

    E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఇంధన విధానం.. అస‌లు ఈ20 ఇంధ‌నం అంటే ఏమిటి?

  • A key step forward in the Supreme Court on the demand for recognition of Ram Setu as a national heritage structure

    Ram Setu : రామసేతుకు జాతీయ వారసత్వ కట్టడంగా గుర్తింపు డిమాండ్‌ పై సుప్రీంకోర్టులో కీలక ముందడుగు

Latest News

  • Wonderful : 5.2 కేజీలతో బాలభీముడు పుట్టాడు..ఎక్కడో తెలుసా..?

  • Trump : జపాన్ పై సుంకం 25 నుంచి 15 శాతానికి తగ్గింపు

  • Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

  • DJ Sound : DJ సౌండ్ తో ప్రాణాలు పోతాయా?

  • Accident : శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది మృతి

Trending News

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

    • GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వ‌స్తువులు త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd