HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Severe Low Pressure Continues Red Alert For Kamareddy And Medak Districts

Heavy rains : కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.. కామారెడ్డి, మెదక్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

  • Author : Latha Suma Date : 27-08-2025 - 3:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Severe low pressure continues.. Red alert for Kamareddy and Medak districts
Severe low pressure continues.. Red alert for Kamareddy and Medak districts

Heavy rains : వాయవ్య బంగాళాఖాతంలో, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు సమీపంగా కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడింది. ఇది ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా మారినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 24 గంటల్లో ఇది నెమ్మదిగా వాయవ్య దిశగా కదలుతూ ఒడిశా తీరాన్ని తాకే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ తీవ్ర అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వానలు విస్తారంగా కురిసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

Read Also: Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు

ఈరోజు మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. మిగతా జిల్లాల్లో వర్షాల ముప్పు ఉండటంతో అక్కడ ఎల్లో హెచ్చరికలు అమలులో ఉన్నాయి. బుధవారం కామారెడ్డి జిల్లాలో కురిసిన కుండపోత వర్షం విషాదానికి దారి తీసింది. తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఉన్న ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. తక్షణమే వారు సమీపంలో ఉన్న డీసీఎం వాహనంలోని వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూశారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.

కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా నీటిమునిగింది. పోలీసులు రంగంలోకి దిగుతూ 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షాల తీవ్రత రైలు మార్గాలపై కూడా ప్రభావం చూపింది. కామారెడ్డి-భిక్కనూర్ మధ్య రైల్వే పట్టాల కింద మట్టి కోతకు గురైంది. పలుచోట్ల ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్-కామారెడ్డి మార్గంలోని రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేస్తూ కాచిగూడ-మెదక్, నిజామాబాద్-తిరుపతి రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరో నాలుగు రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాలపై మళ్లించబడ్డాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. తక్షణమే ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, వరుసగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.

Read Also: US Tariffs : భారత్‌పై విధించిన అదనపు సుంకాల నిర్ణయం.. అమెరికాకే భారం!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bhikkanur
  • heavy rainfall
  • heavy rains
  • Housing Board Colony
  • hyderabad
  • Kalyani Vagu
  • Kamareddy Floods
  • revanth reddy
  • South Central Railway
  • telangana rains
  • Train Cancellation

Related News

Musi River

Musi River : రూ.5800 కోట్లతో మూసీ పునరుజ్జీవనానికి ముహూర్తం ఫిక్స్

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రూ.5800 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు ఉగాది నాడు CM రేవంత్ శంకుస్థాపన చేస్తారు

  • Goat Sheep

    గొర్రెల,మేకలు నుంచి ఇంజెక్షన్లతో రక్తం సేకరిస్తున్న ముఠా..

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

  • NTR Dragon shooting Hyderabad

    హైదరాబాద్ శివారులో ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

Latest News

  • ఉడికించిన గుడ్లు ఎన్ని రోజులు నిల్వ చేసుకోవచ్చు?.. ఎంతసేపటికి తింటే మంచిది?

  • సిరిసంపదలు కలగాలంటే.. ఇంట్లో ఉండాల్సిన విగ్రహాలు ఇవే..!

  • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

  • బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ‌ద్ద ఎంత సంప‌ద ఉందంటే?

  • శశాంకాసనం అంటే ఏమిటి? దాని ఉప‌యోగాలేంటి?

Trending News

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd