HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Rahul Gandhi Karnataka Ceo Notice Double Voting Allegation

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక నోటీసులు జారీ చేశారు.

  • Author : Kavya Krishna Date : 11-08-2025 - 10:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
This is not suicide, it is organized murder: Rahul Gandhi
This is not suicide, it is organized murder: Rahul Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక నోటీసులు జారీ చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ దేశ ఎన్నికల వ్యవస్థలో లోపాలు, పారదర్శకత లోపాన్ని ఎత్తిచూపుతూ చేసిన ఆరోపణలతో ఈ పరిణామం సంబంధం ఉంది. ముఖ్యంగా, కర్ణాటకలో ఒకే ఓటరు రెండుసార్లు ఓటు వేసారని చేసిన ఆయన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.

రాహుల్ గాంధీ తన ప్రసంగం, ప్రజెంటేషన్‌లో “శుకున్ రాణి” అనే మహిళ కర్ణాటక ఎన్నికల్లో రెండుసార్లు ఓటు వేసిందని పేర్కొంటూ, పోలింగ్ అధికారుల రికార్డుల ఆధారంగా పత్రాలను చూపించారు. ఈ పత్రాలు ఎన్నికల కమిషన్ రికార్డుల నుంచి సేకరించినవని కూడా స్పష్టం చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం, పోలింగ్ స్టేషన్ రిజిస్టర్‌లో టిక్ మార్క్ సూచనలు ఉండటం ద్వంద్వ ఓటును నిర్ధారించిందని చెప్పారు.

HYD : చిన్న వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం..దీనికి కారణం వారేనా..? ఇలా జరగకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటి..?

ఈ ఆరోపణలపై కర్ణాటక సీఈవో స్పందిస్తూ, తాము చేసిన ప్రాథమిక విచారణలో శుకున్ రాణి అనే మహిళ ఒక్కసారే ఓటు వేశానని స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. రాహుల్ గాంధీ చూపించిన టిక్ మార్క్ ఉన్న పత్రాలు పోలింగ్ అధికారి జారీ చేసిన అధికారిక రికార్డులు కావని తేలిందని పేర్కొన్నారు. అందువల్ల, రాహుల్ గాంధీ తన ఆరోపణలకు సంబంధించిన అన్ని సాక్ష్యాలను, పత్రాలను సమర్పించాలని నోటీసులో సూచించారు. వీటి ఆధారంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఇక మరోవైపు, ఎన్నికల సంఘం కూడా రాహుల్ గాంధీపై అదే అంశంపై కఠిన వైఖరి చూపింది. ఓట్ల చోరీ ఆరోపణలు నిజమని నిరూపించే డిక్లరేషన్‌ను సమర్పించాలాని, లేదా ఆరోపణలు తప్పయితే దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరింది. తప్పుడు ఆరోపణలు ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉన్నందున, ఇది అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశమని ఎస్ఈసీ స్పష్టం చేసింది.

ఈ పరిణామాలతో, రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మళ్లీ వేడెక్కాయి. ఒకవైపు కాంగ్రెస్ నేతలు ఆయనను సమర్థిస్తుండగా, మరోవైపు బీజేపీ ఆయనపై తప్పుడు ఆరోపణల కేసు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ప్రక్రియపై పారదర్శకత అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

India Developmemt : భారత్ అభివృద్ధిని కొన్ని దేశాల నేతలు చూడలేకపోతున్నారు : రాజ్‌నాథ్ సింగ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Double Voting
  • Election commission
  • Karnataka CEO
  • rahul gandhi

Related News

Trump's harsh comments on India.. Is that why Modi is silent?: Rahul Gandhi asks

Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా యూడీఎఫ్ కూటమి భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మరియు సంక్షేమ పింఛన్లను ఏకంగా

  • Harish Rao Kanchukota

    Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

  • MLC Elections

    Jeevan Reddy : ఎంతమంది బుజ్జగించిన తగ్గేదేలే అంటున్న జీవన్ రెడ్డి

  • Rythubharosa Money

    Rythu Bharosa : నేడే రైతు భరోసా నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి మాత్రం జమ అప్పుడే !!

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd