HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Election Commission Seizes Rs 4650 Crore Ahead Of Lok Sabha Polls Highest Ever

Rs 4650 Crore Seized : సరికొత్త రికార్డ్.. రూ.4,650 కోట్లు సీజ్ చేసిన ఈసీ

Rs 4650 Crore Seized : లోక్ సభ ఎన్నికల టైంలో నగదు, మద్యం, కానుకల ప్రవాహం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు.

  • By Pasha Published Date - 03:14 PM, Mon - 15 April 24
  • daily-hunt
Rs 4650 Crore Seized
Rs 4650 Crore Seized

Rs 4650 Crore Seized : లోక్ సభ ఎన్నికల టైంలో నగదు, మద్యం, కానుకల ప్రవాహం జరుగుతుందనే విషయం అందరికీ తెలుసు. ఈసారి పోలింగ్‌కు ముందే భారీగా నగదు ప్రవాహం జరిగింది. ఈ మాటకు పూర్తి ఆధారంగా నిలిచే కీలక ప్రకటన సాక్షాత్తూ కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. 75 ఏళ్ల భారతదేశ లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా నగదును స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు ముందు రికార్డు స్థాయిలో రూ. 4,650 కోట్లను(Rs 4650 Crore Seized) స్వాధీనం చేసుకున్నామని ఈసీ ప్రకటించింది.

We’re now on WhatsApp. Click to Join

2019 లోక్‌సభ ఎన్నికల టైంలో రూ.3,475 కోట్లను ఈసీ సీజ్ చేసింది. ఈసారి ఆ అమౌంట్ రూ. 4,650 కోట్లకు చేరింది. అంటే దాదాపు రూ.1000 కోట్లు అదనంగా ఈసారి కేంద్ర ఎన్నికల సంఘానికి దొరికాయి. ఈ ఏడాది మార్చి 1 నుంచి సగటున ప్రతిరోజూ రూ.100 కోట్లు చొప్పున ఈసీ సీజ్ చేసింది. ఎన్నికల సంఘానికి చెందిన  ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, వీడియో వ్యూయింగ్ టీమ్‌లు జరిపిన తనిఖీల్లో ఈ డబ్బంతా దొరికింది. ఎన్నికల వేళ తాయిలాలుగా నగదు, మద్యం, ఉచితాలు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలను ప్రజలకు పంపిణీ చేయకుండా అడ్డుకునేందుకు ఈసీ నిత్యం కసరత్తు చేస్తోంది.

Also Read :Sri Ram Navami Remedies : శ్రీరామనవమి రోజు ఎరుపు దుస్తులు ధరిస్తే ఏమవుతుందో తెలుసా ?

తాజాగా శనివారం రాత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఏకంగా 1425 కేజీల బంగారు బిస్కెట్లను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.700 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.  కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రీపెరుంబుదూర్‌-కుండ్రత్తూర్‌ రహదారిలో ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ నిర్వహించిన తనిఖీల్లో  ఈ బంగారు బిస్కెట్లు దొరికాయి.ఓ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ, మినీ కంటెయినర్‌ లారీలను అధికారులు చెక్ చేయగా అవాక్కయ్యారు.  ఓ వాహనంలో 1000 కిలోల గోల్డ్ బిస్కెట్లు, మరో వాహనంలో 400 కిలోల గోల్డ్ బిస్కెట్లు ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ బంగారాన్ని చెన్నై విమానాశ్రయం నుంచి శ్రీపెరుంబుదూర్‌ సమీపంలోని మన్నూర్‌లో ఉన్న ఓ గోదాముకు(1400 KG Gold Seized) తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. మొత్తం బంగారంలో 400 కిలోలకు మాత్రమే ఆధారాలు ఉన్నాయి. మిగతా 1000 కేజీల గోల్డ్‌కు సరైన డాక్యుమెంట్స్ లేవు. దీంతో వెంటనే ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు.. చెన్నై విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారులకు సమాచారాన్ని చేరవేశారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా దీనిపై సమాచారం అందించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Election commission
  • elections 2024
  • lok sabha
  • Lok Sabha polls
  • Rs 4650 Crore Seized

Related News

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd