Health Tips: జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
ఈ ఆయుర్వేద చిట్కాల ద్వారా శరీరానికి సహజంగా కోలుకునే అవకాశం లభిస్తుంది. మందులపై ఆధారపడటం తగ్గుతుంది. వేడి నీరు, కషాయం శరీరం నుండి టాక్సిన్స్ను బయటకు పంపడానికి సహాయపడతాయి.
- Author : Gopichand
Date : 08-10-2025 - 2:10 IST
Published By : Hashtagu Telugu Desk
Health Tips: మారుతున్న ఈ కాలంలో ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు (Health Tips) గురవుతారు. ఇలాంటి పరిస్థితిలో శరీరంలో శక్తి ఉండదు. ఏ పని చేయాలని మనసుకి అనిపించదు. తరచుగా తుమ్ములు రావడం, ముక్కు కారడం, గొంతు పాడవటం రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతూ సహజ పద్ధతిలో ఉపశమనం పొందాలనుకుంటే ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి? మీ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
జలుబు తొలి లక్షణంలోనే ఆహారం ఆపేయాలి
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీకు జలుబు మొదటి లక్షణాలు (Cold Symptoms) కనిపించినట్లయితే ముందుగా ఘన ఆహారాన్ని ఆపివేయండి. అసలు ఏమీ తినవద్దు. కేవలం వేడి నీరు, హెర్బల్ టీ లేదా కషాయం మాత్రమే తీసుకోండి. మీరు కావాలంటే కొబ్బరి నీళ్లు, పండ్లు, పండ్ల రసాలు కూడా తీసుకోవచ్చు. రొట్టె, అన్నం వంటి అన్నిటినీ ఆపేయండి. మూడు నుండి నాలుగు రోజుల్లో మీరు చాలా సులభంగా కోలుకుంటారు.
Also Read: Kantara – Chapter 1 : రూ.400 కోట్ల క్లబ్ లో కాంతార చాప్టర్-1
కషాయం తయారు చేసే విధానం
వైద్యుల ప్రకారం.. మీరు ఈ పదార్థాలతో ఒక అద్భుతమైన కషాయాన్ని తయారు చేసుకోవచ్చు. సోంపు, యాలకులు, తులసి, అల్లం, పసుపు. వీటినన్నిటినీ నీటిలో వేసి మరగబెట్టి ప్రతిరోజూ సేవించండి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ చిట్కాతో మీ జలుబు 3-4 రోజుల్లో తగ్గిపోతుంది.
ఈ ఆయుర్వేద చిట్కాల ప్రయోజనాలు
ఈ ఆయుర్వేద చిట్కాల ద్వారా శరీరానికి సహజంగా కోలుకునే అవకాశం లభిస్తుంది. మందులపై ఆధారపడటం తగ్గుతుంది. వేడి నీరు, కషాయం శరీరం నుండి టాక్సిన్స్ను బయటకు పంపడానికి సహాయపడతాయి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన శరీరం తన శక్తిని సంక్రమణతో పోరాడటానికి ఉపయోగించగలదు. మొత్తంగా ఈ చిట్కాలు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జలుబును మూలం నుండి నయం చేయడానికి సహాయపడతాయి.