Mutual Fund: ఈ స్కీంతో ఐదేళ్లలోనే చేతికి రూ. 10 లక్షలు..!
- By Vamsi Chowdary Korata Published Date - 11:30 AM, Sat - 15 November 25
దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ ఆప్షన్ అని చెబుతుంటారు నిపుణులు. ఇక్కడ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బెనిఫిట్ కారణంగా.. సంపద ఏటా పెరుగుతూనే ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు రూ. 10 వేల సిప్ను ఐదేళ్లలోనే ఏకంగా రూ. 10 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి మనం ఇప్పుడు చూద్దాం.
మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ రిస్క్కు లోబడి ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్టాక్ మార్కెట్లు పతనం అవుతుంటే.. మ్యూచువల్ ఫండ్లలో లాభాలు తగ్గుతుంటాయని చెప్పొచ్చు. అయితే ఇది కొంత కాలం మాత్రమే ఉంటుంది. దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకోవచ్చని నిపుణులు సూచిస్తుంటారు. ఇక్కడ కాంపౌండింగ్ ప్రయోజనాల కోసం మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువగా జనం ఇన్వెస్ట్ చేస్తుంటారు. దీనినే చక్రవడ్డీ అంటారు. చక్రవడ్డీ అంటే వడ్డీపై వడ్డీ వస్తుంది. ఈ కారణంగానే.. ఏటా కాలం గడుస్తున్న కొద్దీ కూడా సంపద పెరుగుతూ పోతూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లు పతనం అవుతున్నాయని వెంటనే ఇందులో నుంచి పెట్టుబడుల్ని ఉపసంహరించుకోవద్దని గుర్తుంచుకోవాలి. అస్థిరత కొంత కాలమే ఉంటుంది. దీర్ఘకాలంలో మాత్రం మరింత ఎక్కువగా లాభాలు వస్తుంటాయి.
మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఎన్నో పథకాలు.. చిన్న మొత్తాల పెట్టుబడిపైనా పెద్ద మొత్తంలో రాబడి ఇచ్చాయి. ఇక్కడ కనీసం రూ. 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇలా అద్భుత స్థాయిలో రిటర్న్స్ అందించిన ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ గురించి తెలుసుకుందాం. అదే బరోడా బీఎన్పీ పారిబస్ మ్యూచువల్ ఫండ్ నుంచి.. బరోడా BNP పారిబస్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్.
ఈ స్కీమ్ లాంగ్ రన్లో కాసుల పంట పండించింది. నెలకు రూ. 10 వేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఐదేళ్లలోనే రూ. 10 లక్షల వరకు రావడం విశేషం. ఈ మేరకు ఫండ్ హౌస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. లాంగ్ టర్మ్ పెట్టుబడిదారులకు ఇది బెస్ట్ ఆప్షన్ అని పేర్కొంది. కేవలం ఐదేళ్ల వ్యవధిలోనే ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ ఏకంగా రూ. 1500 కోట్ల మార్కు దాటింది.
లంప్సమ్ పెట్టుబడుల విషయానికి వస్తే.. ఒకేసారి రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఐదేళ్లలో రూ. 2.74 లక్షలు వచ్చాయని చెప్పొచ్చు. ఇక్కడ రెట్టింపునకు మించి లాభం వచ్చిందన్నమాట. సంజయ్ చావ్లా ఈ ఫండ్ మేనేజర్గా ఉన్నారు. ఈయన ఈక్విటీకి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్గా ఉన్నారు. కిరణ్ మెహ్తా సీనియర్ అనలిస్టుగా ఉన్నారు. గత మూడేళ్ల వ్యవధిలో చూస్తే సగటున వార్షిక ప్రాతిపదికన 17.08 శాతం రాబడి అందించింది. ఇదే సమయంలో బెంచ్మార్క్ BSE లార్జ్ అండ్ మిడ్ క్యాప్ టీఆర్ఐ 13.9 శాతం రాబడినే ఇచ్చింది. ఇది లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీ స్టాక్స్లో కనీసం 35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేస్తుంది.