Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు
- Author : Vamsi Chowdary Korata
Date : 16-06-2026 - 11:23 IST
Published By : Hashtagu Telugu Desk
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. ఏడాది పొడవునా కొనుగోలు చేస్తూనే ఉంటారు. ఇక పెళ్లిళ్లు, శుభకార్యాల అనగానే మన ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చేంది బంగారమే. కచ్చితంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది. అంతే కాదు పెట్టుబడికి పెట్టాలనుకునే వారికి బంగారం ఒక మంచి మార్గం. అయితే, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత బంగారం ధరల్లో ఊహించని మార్పులు కనిపించాయి. సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ, ఇక్కడ దిగివచ్చాయి. ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ పెరగడం, రూపాయి పడిపోవడం వంటివి కారణమయ్యాయి. అయితే, ఇటీవలే ఇరాన్- అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగడంతో కొనుగోలుదారుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఇవాళ బంగారం ధరలు దిగివచ్చాయి. ఈ క్రమంలో జూన్ 16వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధరలు దిగివచ్చాయి. ఈరోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 5 డాలర్ల వరకు తగ్గింది. దీంతో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4325 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.34 శాతం మేర తగ్గింది. దీంతో ఔన్స్ వెండి ధర 69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మూడు రోజుల తర్వాత దిగివచ్చాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ.160 మేర దిగివచ్చింది. దీంతో తులం బంగారం రేటు రూ.1,51,370 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల బంగారం రేటు రూ.150 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ.1,38,750 వద్దకు తగ్గింది.
బంగారంతో పాటు వెండి రేటు సైతం ఈరోజు దిగివచ్చింది. గత మూడు రోజుల పాటు రూ.20 వేల మేర పెరిగిన తర్వాత ఇవాళ తగ్గింది. ఈరోజు రూ.5000 మేర కిలో వెండి ధర తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు రూ. 2,75,000 వద్దకు దిగివచ్చింది.