HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Visits Sringeri Sharada Peetham And Spends An Hour There

YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్‌ జగన్‌.. గంటసేపు అక్కడే?

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించారు. మంగళవారం ఆయన శ్రీవిధుశేఖర భారతి మహాస్వామిని కలసి ఆశీర్వచనం పొందారు. సుమారు గంటపాటు స్వామిజితో చర్చలు జరిపారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-11-2024 - 5:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Visits Sri Sringeri Sharada Peetham
Ys Jagan Visits Sri Sringeri Sharada Peetham

విజయవాడలోని శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సందర్శించారు. పీఠంలోని శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీని కలిశారు. స్వామీజీ నుంచి ఆశీర్వాదం తీసుకున్న జగన్ దాదాపు ఒక గంటపాటు అక్కడ గడిపారు. ఈ సమయంలో స్వామీజీతో వారు చర్చించిన విషయాలను మాత్రం ఎక్కడ చెప్పలేదు. సమావేశం అనంతరం జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ భరత్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. జగన్ రాకతో స్థానిక కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు.

వైఎస్ జగన్ శ్రీ శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించి, స్వామీజీ శ్రీ విధుశేఖర భారతీని కలవడం తాజాగా ఆసక్తి రేపింది. ఆయన అక్కడ దాదాపు ఒక గంటసేపు గడిపారు, దీంతో పీఠంలో జరిగిన చర్చలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అయితే, వైఎస్సార్‌సీపీ వర్గాలు ఈ సందర్శనను కేవలం స్వామీజీ ఆశీస్సులు తీసుకోవడం కోసమే వెళ్లినట్లుగా పేర్కొంటున్నాయి, ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడలేదు అని తెలిపారు.

వైఎస్ జగన్ గడచిన కాలంలో ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా ఉండగా ఎక్కువగా విశాఖపట్నంలో ఉన్న శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి, పీఠాధిపతులైన శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఏపీ ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ ఈ పీఠాన్ని సందర్శించలేదు.

ఇదిలా ఉంటే, వైఎస్ జగన్ శారదా పీఠానికి చేరుకోబోతుండగా, కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారిలో కొన్ని కుటుంబాలు ఓ మృతదేహంతో హల్చల్ చేసి, తాము ఎదుర్కొన్న ఆవేదనను వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా విజయవాడకు చెందిన నక్కా వెంకట శివనాగేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డుప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. అయితే, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సరిగ్గా వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారని బాధితులు ఆరోపించారు.

ఈ విషయంలో కుటుంబీకులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుని, మృతదేహాన్ని శారదా పీఠం దగ్గరకు తీసుకువచ్చారు. పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి వెనక్కి పంపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • sri sringeri sharada peetham
  • ys jagan
  • ysrcp

Related News

Ys Sharmila

YS Sharmila : రాజారెడ్డి, YSR పేర్లపై రాజకీయాలు చేయొద్దు.. టీడీపీకి షర్మిల కౌంటర్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి పేర్లను రాజకీయంగా ఉపయోగిస్తున్నారంటూ టీడీపీపై వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తమపై జరుగుతున్న ప్రచారం రాజకీయ అక్కసుతో చేస్తున్నదేనని ఆమె ఆరోపించారు. దివంగతులపై ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సరికాదని షర్మిల పేర్కొన్నారు. నిజంగా ఆరోపణల్లో వాస్తవం ఉంటే గతంలో అధికారంలో

  • Sai Vaishnavi Nellore

    Nellore : రాజ‌కీయాల్లోకి కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి కుమార్తె.. ఫ‌స్ట్ ప్రెస్‌మీట్‌లోనే అద‌ర‌గొట్టిన సాయివైష్ణ‌వి

  • Chandrababu Naidu

    Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Atchannaidu fires on ys Jagan

    Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

Latest News

  • Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • NTR : అమీర్‌పేట్ చౌరస్తాలో నేడు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి

  • NTR : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్

  • Hawala Cash : దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో భారీ నగదు పట్టివేత.. హ‌వాలా డ‌బ్బుగా పోలీసుల అనుమానాం

  • IPL 2026 : సూర్యవంశీ విధ్వంసం.. క్వాలిఫయర్-2లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd