HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Hot Comments On Nara Lokesh

YS Jagan: పప్పూ నిద్ర వదులు.. మంత్రి లోకేష్‌పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.

  • Author : Gopichand Date : 30-06-2025 - 9:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan
YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న గందరగోళానికి ఏపీ ఈసెట్ (AP ECET) అడ్మిషన్ ప్రక్రియ ఆలస్యం ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) ఆరోపించారు. మే 15, 2025న ఈసెట్ ఫలితాలు వెలువడినప్పటికీ.. 45 రోజులు గడిచినా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించకపోవడం, అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితంలో నెట్టివేసిందని ఆయన విమర్శించారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. అయినప్పటికీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కాకపోవడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో జూలై 1, 2025 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లు ఇంకా పూర్తి కాకపోవడం విద్యార్థుల ఆందోళనను మరింత పెంచుతోంది.

Also Read: Iron Pan: ఈ కూర‌లు వండాలంటే ఇనుప క‌డాయి కావాల్సిందే.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా!

వైఎస్ జగన్ తన ఎక్స్ పోస్ట్‌లో లోకేష్‌ను ఉద్దేశించి “అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన ఆరోపించారు. ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ సాధారణంగా జూన్ లేదా జూలైలో మొదలవుతుంది. అయితే, ఈ ఏడాది ఆలస్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…

— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025

కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, సీటు కేటాయింపు వంటి దశలు ఉంటాయి. అర్హత సాధించిన విద్యార్థులు కనీసం 25% మార్కులు (200లో 50 మార్కులు) సాధించాలి. ఈ ఆలస్యం వల్ల విద్యార్థులు తమ కోర్సులు, కళాశాలలు ఎంచుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఇది వారి విద్యా షెడ్యూల్‌ను దెబ్బతీస్తోంది. ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని.. వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించి, అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP ECET
  • ap politics
  • APSCHE
  • nara lokesh
  • ys jagan

Related News

Farmers Drumstick

ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Farmers :  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జ

  • Godavari Pushkaralu 2027

    Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

  • Chandrababu Naidu Lays Foun

    Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

  • Lokesh Foreign Tour

    Lokesh Foreign Tour : CIBC ప్రెసిడెంట్ తో నారా లోకేశ్ భేటీ

  • Nara Lokesh Meets Google Ce

    Lokesh US Tour : సుందర్ పిచాయ్, శంతను నారాయణన్‌లతో కీలక భేటీ

Latest News

  • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

  • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

  • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

  • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

  • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

Trending News

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

    • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

    • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd