HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ys Jagan Hot Comments On Nara Lokesh

YS Jagan: పప్పూ నిద్ర వదులు.. మంత్రి లోకేష్‌పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు!

ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు.

  • By Gopichand Published Date - 09:44 AM, Mon - 30 June 25
  • daily-hunt
YS Jagan
YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థలో చోటు చేసుకున్న గందరగోళానికి ఏపీ ఈసెట్ (AP ECET) అడ్మిషన్ ప్రక్రియ ఆలస్యం ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) ఆరోపించారు. మే 15, 2025న ఈసెట్ ఫలితాలు వెలువడినప్పటికీ.. 45 రోజులు గడిచినా కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించకపోవడం, అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితంలో నెట్టివేసిందని ఆయన విమర్శించారు.

ఈ ఏడాది ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లాటరల్ ఎంట్రీ కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఏపీ ఈసెట్ పరీక్ష రాయగా.. 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. అయినప్పటికీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలు కాకపోవడం విద్యార్థులను నిరాశకు గురిచేస్తోంది. ఇంజినీరింగ్ కళాశాలల్లో జూలై 1, 2025 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో అడ్మిషన్లు ఇంకా పూర్తి కాకపోవడం విద్యార్థుల ఆందోళనను మరింత పెంచుతోంది.

Also Read: Iron Pan: ఈ కూర‌లు వండాలంటే ఇనుప క‌డాయి కావాల్సిందే.. రుచి మాత్రమే కాదు ఆరోగ్యం కూడా!

వైఎస్ జగన్ తన ఎక్స్ పోస్ట్‌లో లోకేష్‌ను ఉద్దేశించి “అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు” అంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆయన ఆరోపించారు. ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్ సాధారణంగా జూన్ లేదా జూలైలో మొదలవుతుంది. అయితే, ఈ ఏడాది ఆలస్యం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) త్వరలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో…

— YS Jagan Mohan Reddy (@ysjagan) June 29, 2025

కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆప్షన్ ఎంట్రీ, సీటు కేటాయింపు వంటి దశలు ఉంటాయి. అర్హత సాధించిన విద్యార్థులు కనీసం 25% మార్కులు (200లో 50 మార్కులు) సాధించాలి. ఈ ఆలస్యం వల్ల విద్యార్థులు తమ కోర్సులు, కళాశాలలు ఎంచుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. ఇది వారి విద్యా షెడ్యూల్‌ను దెబ్బతీస్తోంది. ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని.. వెంటనే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటించి, అడ్మిషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP ECET
  • ap politics
  • APSCHE
  • nara lokesh
  • ys jagan

Related News

Nara Lokesh

Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

  • Sand Supply

    Sand Supply : ఆంధ్ర నుంచి తెలంగాణ కు యథేచ్ఛగా ఇసుక

  • Lokesh Google

    Nara Lokesh’s USA Tour : డల్లాస్ లో పర్యటించబోతున్న మంత్రి లోకేశ్

  • Cbn Jagan

    Krishna River Water : చంద్రబాబుకు గుడ్ న్యూస్ చెప్పిన వైఎస్ జగన్.!

  • Ap

    AP CM Chandrababu : ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..!

Latest News

  • Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!

  • Sarpanch Election Schedule: పంచాయతీ ఎన్నికల నగారా.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి!

  • Bihar Speaker: బీహార్‌లో స్పీకర్ పదవిపై రాజకీయ పోరు.. బీజేపీ, జేడీయూలలో ఎవరికి దక్కేను?

  • India vs South Africa: రెండో టెస్ట్‌లో భారత్‌కు భారీ లక్ష్యం.. టీమిండియా గెలుపు క‌ష్ట‌మేనా?!

  • Bihar Election Results Effect : ఏడుగురు నేతలపై కాంగ్రెస్ వేటు

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd