HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >You Should Think About What Will Happen To You If Jagan Comes To Power Perni Nani

YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

  • By Latha Suma Published Date - 12:43 PM, Thu - 7 August 25
  • daily-hunt
You should think about what will happen to you if Jagan comes to power: Perni Nani
You should think about what will happen to you if Jagan comes to power: Perni Nani

YSRCP : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబులో సంకుచిత ఆలోచనలు పెరుగుతున్నాయని, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీలను తరలించి, భయభ్రాంతులు సృష్టించారని పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుసరిస్తున్న రాజకీయ రీతులు సినిమాల్లో మాత్రమే చూసేవాళ్లం అని, కానీ ఇప్పుడు ఆయనే ప్రజలకు వాటిని ప్రత్యక్షంగా నేర్పిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మరో నేత రాముపై రౌడీలు కత్తులు, రాడ్లతో దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఆయుధాలతో విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారని వివరించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే కుట్రలో భాగమని పేర్కొన్నారు. ఈ దాడి విషయమై స్థానిక పోలీసులకు ముందే సమాచారం ఉన్నా, మౌనంగా ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్ని నాని ఆరోపించారు. ఇది సినిమా స్క్రిప్ట్‌లా పూర్తిగా ప్లాన్ చేసిన చర్య అని తీవ్ర ఆరోపణలు చేశారు.

పులివెందులలో గెలిచామని చెబుతూ చంద్రబాబు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని నాని అన్నారు. ప్రజలపై భయం సృష్టించి విజయం సాధించడాన్ని పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం కాదు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంతగా బైండోవర్లు పెట్టారని, కేసుల్లేని అమాయకులకూ అకారణంగా కేసులు బాదారని ఆయన మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంటే, రాష్ట్రం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలలో భద్రతాభావం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని గుర్తుచేశారు. ఎలాంటి అల్లర్లు లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే తమ కోరిక అని స్పష్టంచేశారు. జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే, ప్రజలను భయపెట్టే వారిని ఎలా ఎదుర్కొంటామో అప్పుడు తెలుస్తుందని పేర్ని నాని ఘాటుగా హెచ్చరించారు. ప్రజలే చివరికి తీర్పు చెప్పే అధికారం కలిగిన న్యాయమూర్తులని, ప్రజాస్వామ్యాన్ని లఘుస్తాయికి తేవాలని చూసే వారిని చరిత్రే శాసిస్తుందని తెలిపారు.

Read Also: Cluster Beans : మరచిపోతున్నారా? ..గోరు చిక్కుడు కాయ‌ల‌ను త‌రచూగా తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • Local Body Elections
  • perni nani
  • Pulivendula
  • tdp
  • ys jagan
  • ysrcp
  • ZPTC election

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

  • Elections

    Elections: మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు?

  • Botsa Satyanarayana

    YCP: కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన‌ కార్మిక బిల్లుపై వైసీపీ తీవ్ర అభ్యంత‌రం!

  • Dussehra Festival

    Dussehra: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దసరా అలంకారాల వైభవం 11 రోజులు

Latest News

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్ యాద‌వ్‌కు షాక్‌.. మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత‌!

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd