HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >You Should Think About What Will Happen To You If Jagan Comes To Power Perni Nani

YSRCP : జగన్ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోవాలి: పేర్ని నాని

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

  • Author : Latha Suma Date : 07-08-2025 - 12:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
You should think about what will happen to you if Jagan comes to power: Perni Nani
You should think about what will happen to you if Jagan comes to power: Perni Nani

YSRCP : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. వయసు పెరుగుతున్న కొద్దీ చంద్రబాబులో సంకుచిత ఆలోచనలు పెరుగుతున్నాయని, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలన్నింటికీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం పులివెందుల జడ్పీటీసీ స్థానానికి మాత్రమే ఉప ఎన్నికను ప్రకటించిందని ఆరోపించారు. ఇది పూర్తిగా పక్షపాత ధోరణికి నిదర్శనమని, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసినప్పటి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రౌడీలను తరలించి, భయభ్రాంతులు సృష్టించారని పేర్ని నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు అనుసరిస్తున్న రాజకీయ రీతులు సినిమాల్లో మాత్రమే చూసేవాళ్లం అని, కానీ ఇప్పుడు ఆయనే ప్రజలకు వాటిని ప్రత్యక్షంగా నేర్పిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మరో నేత రాముపై రౌడీలు కత్తులు, రాడ్లతో దాడి చేశారని ఆయన ఆరోపించారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడినట్టు వెల్లడించారు. కారు అద్దాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఆయుధాలతో విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారని వివరించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే కుట్రలో భాగమని పేర్కొన్నారు. ఈ దాడి విషయమై స్థానిక పోలీసులకు ముందే సమాచారం ఉన్నా, మౌనంగా ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్ని నాని ఆరోపించారు. ఇది సినిమా స్క్రిప్ట్‌లా పూర్తిగా ప్లాన్ చేసిన చర్య అని తీవ్ర ఆరోపణలు చేశారు.

పులివెందులలో గెలిచామని చెబుతూ చంద్రబాబు ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని నాని అన్నారు. ప్రజలపై భయం సృష్టించి విజయం సాధించడాన్ని పెద్దగా చెప్పుకోవాల్సిన విషయం కాదు అని ఎద్దేవా చేశారు. ఎన్నికల చరిత్రలో ఎన్నడూ లేనంతగా బైండోవర్లు పెట్టారని, కేసుల్లేని అమాయకులకూ అకారణంగా కేసులు బాదారని ఆయన మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మౌనంగా ఉంటే, రాష్ట్రం అగ్నిగుండంగా మారే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజలలో భద్రతాభావం కలిగించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని గుర్తుచేశారు. ఎలాంటి అల్లర్లు లేకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలన్నదే తమ కోరిక అని స్పష్టంచేశారు. జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే, ప్రజలను భయపెట్టే వారిని ఎలా ఎదుర్కొంటామో అప్పుడు తెలుస్తుందని పేర్ని నాని ఘాటుగా హెచ్చరించారు. ప్రజలే చివరికి తీర్పు చెప్పే అధికారం కలిగిన న్యాయమూర్తులని, ప్రజాస్వామ్యాన్ని లఘుస్తాయికి తేవాలని చూసే వారిని చరిత్రే శాసిస్తుందని తెలిపారు.

Read Also: Cluster Beans : మరచిపోతున్నారా? ..గోరు చిక్కుడు కాయ‌ల‌ను త‌రచూగా తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu naidu
  • Local Body Elections
  • perni nani
  • Pulivendula
  • tdp
  • ys jagan
  • ysrcp
  • ZPTC election

Related News

Tdp Door To Door Campaign

టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం

ఈ వినూత్న విధానం వల్ల పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక సామాన్య కార్యకర్త కూడా తన పనితీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది

    Latest News

    • ‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!

    • టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

    • అల‌ర్ట్‌.. చెవి క్యాన్స‌ర్ ల‌క్ష‌ణాలివే!

    • టీవీఎస్ ఎన్-టార్క్ 150.. హైపర్ స్పోర్ట్ స్కూటర్ యుగం ప్రారంభం!

    • కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!

    Trending News

      • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

      • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

      • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

      • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

      • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd