Jagan Plan: మా నమ్మకం నువ్వే జగనన్నా.. ప్రోగ్రాం ఫోకస్
వైసీపీకి ఐ ప్యాక్ టీం ఎన్నికల వ్యూహకర్తగా ఉంది. ఆ సలహాలు తీసుకుని కొత్త కార్యక్రమాలను వైసీపీ అధినాయకత్వం డిజైన్ చేస్తోంది. అలా వచ్చిందే మా నమ్మకం నువ్వే జగనన్నా ప్రోగ్రాం. ఈ నెల 7 నుంచి ఏపీవ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాలలో గొప్పగానే స్టార్ట్ అయింది.
- By CS Rao Published Date - 06:38 PM, Mon - 10 April 23
Jagan Plan : వైసీపీకి ఐ ప్యాక్ టీం ఎన్నికల వ్యూహకర్తగా ఉంది. ఆ సలహాలు తీసుకుని కొత్త కార్యక్రమాలను వైసీపీ అధినాయకత్వం డిజైన్ చేస్తోంది. అలా వచ్చిందే మా నమ్మకం నువ్వే జగనన్నా ప్రోగ్రాం. ఈ నెల 7 నుంచి ఏపీవ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాలలో గొప్పగానే స్టార్ట్ అయింది. అయితే స్టార్ట్ అయిన ముహూర్తం సరిగ్గా ఉందా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ లో ఎండలు మండుతున్నాయి. మరో వైపు క్యాడర్ నీరసిల్లి ఉంది.
లీడర్లు అంతా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఏడాదిగా తిరిగి అలసి సొలసి ఉన్నారు. ఈ టైం లో మరో కార్యక్రమం అది కూడా రెండు వారాల పాటు ఉధృతంగా తిరగాలని అదేశాలు వచ్చాయి. దాంతో తొలి రోజు మొక్కుబడిగా తిరిగిన మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తరువాతనే చతికిలపడ్డారనే అంటున్నారు.
ఇక ఈ తీరును చూసిన వారంతా మా నమ్మకం నువ్వే జగన్ (Jagan) ప్రోగ్రాం అపుడే ఫెయిల్ అయింది అని అంటున్నారు. దీనికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అదేంటి అంటే ఎమ్మెల్యేలకు లోకల్ లీడర్స్ కి క్యాడర్ కి మధ్య గ్యాప్ చాలా పెరిగిపోయింది. నాలుగేళ్ళుగా ఎమ్మెల్యేలు తమకేమీ చేయలేదన్న గుస్సాతో క్యాడర్ నిండా ఉంది. దాంతో ఎక్కడా ఎమ్మెల్యేలకు క్యాడర్ నుంచి ఎలాంటి సాయం అందడం లేదని అంటున్నారు.
అంతే కాదు ఆర్భాటంగా ఏపీ వ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా గృహ సారధులను నియమించామని చెప్పుకున్నారు. అలగే సచివాలయం పరిధిలో ఒకరిని చైర్మన్ గా కూడా చేశామన్నారు. ఇపుడు గృహ సారధులు డుమ్మా కొడుతున్నారు వాలంటీర్ల చైర్మన్లు అయిపూ అజా లేకుండా పోతున్నారు.
ఇంటింటికీ ఇలా తిరగడం వల్ల మాకు ఏంటి అని గృహ సారధులు కానీ సచివాలయం చైర్మన్ కానీ క్యాడర్ కానీ గట్టిగానే ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారుట. ఎండలో కాళ్ళరిగేలా ఎందుకు తిరగాలి అన్నదే వారి ప్రశ్న. బాధ ఆవేదన. గృహ సారధులను ఎక్కడ నుంచో తీసుకోలేదు క్యాడర్ నుంచే ఎంపిక చేశారు. అలాగే సచివాలయం చైర్మన్లుగా ఉన్న వారు కూడా పార్టీకి చెందిన వారే.
అందువల్ల వారు సరైన సమయం చూసుకుని మరీ పార్టీ మాకేమిచ్చింది. మేము ఎందుకు రావాలీ అని అడుగుతున్నారని టాక్. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఫ్యామిలీని సైతం వదిలి వస్తే మాకు ఒరిగేది ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారుట. మొత్తానికి ఆదిలోనే ఇలాంటి తిరుగుబాటుని ఊహించని ఎమ్మెల్యేలు మాత్రం ఖంగు తింటున్నారుట. మరో వైపు చూస్తే ఎమ్మెల్యేల ఫోటలు వీడియోలు తీసుకుని చాలా మంది వెళ్తున్నారుట.
ఇవన్నీ చూస్తూంటే ఒక్కటే అనిపిస్తోందని వైసీపీని అభిమానించే వారు హితైషులు అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పార్టీని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాని ఫలితాలను ఇపుడు అనుభవిస్తుంది అని అంటున్నారు. అది ఏ విధంగా ఉందంటే అధినాయకత్వానికి ఎమ్మెల్యేలకు గ్యాప్ ఉంది. ఎమ్మెలెయలకు లీడర్స్ కి గ్యాప్ ఉంది. లీడర్స్ కి క్యాడర్ కి మధ్య బిగ్ గ్యాప్ ఉంది. అలా ఏ వైపు నుంచి చూసినా అంతరాలే అవాంతరాలుగా మారుతున్నాయి.
అయినా కూడా ఎక్కడ లోటు ఉందో పొరపాటు ఉందో చూసుకోకుండా దానికి సరి చేసుకోకుండా నేల విడిచి సాము చేయాలనుకుంటే హడావుడిగా ఆర్భాటంగా ఇలాంటి కార్యక్రమాంలు చేపడితే జనంలోనూ ఇతర పార్టీల వద్ద అభాసుపాలు కావడం తప్ప మరేమీ ఉండదని అంటున్నారు. ఎక్కడైనా పార్టీని కడుపులో పెట్టుకుని చూసుకుంటే ఇన్ని తిప్పలు అవస్థలు పడనవసరం లేదని అంటున్నారు.
జనాలతోనే కనెక్షన్ అన్నా కూడా వారిని పార్టీని అనుసంధానం చేసేది ఎవరు అన్నదే కీలకమైన ప్రశ్న. క్యాడర్ లేకుంటే జనాలతో పార్టీకి లింక్ ఎలా ఉంటుంది అన్న సూక్షమైన విషయాన్ని విస్మరించడం వల్ల ఈ తరహా కార్యక్రమాలు ఎన్ని చేపట్టిన వైసీపీకి ఇబ్బందులు తపవనేఅ అంటున్నారుట.
Also Read: Bandi Sanjay: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బలగం సినిమా చూసిన బండి సంజయ్
Related News
AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి