HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Twins Secure Identical Marks In Intermediate Results

ఇంటర్ ఫలితాల్లో ఒకే మార్కులు సాధించిన కవలలు

  • Author : Vamsi Chowdary Korata Date : 16-04-2026 - 2:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Twins Same Marks in Intermediate Results 2026
Twins Same Marks in Intermediate Results 2026

ఏపీలో ఇంటర్‌ ఫలితాల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. రెండు చోట్ల కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చాందిని, చర్మిల అనే కవలలు 470 మార్కులకు గాను ఇద్దరూ 459 చొప్పున మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలం కోవిలానికి చెందిన కవలలు భరత్‌ చరణ్‌, భవ్యశ్రీ 470 మార్కులకు 447 మార్కులు సాధించారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించి ఔరా అనిపించారు. ఏపీలో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కవలలు ఒకేలా మార్కులు సాధించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కృష్ణారావు, రేణుక దంపతుల కుమార్తెలు చార్మి, చాందినిలు కవలలు. వీరిద్దరు పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలం రేగులపాడు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరిద్దరు బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 470 మార్కులకు 459 మార్కులు సాధించారు. అంటే ఇద్దరికీ ఒకేలా 459 మార్కులు రావటం విశేషం. చార్మి, చాందినిల తండ్రి కృష్ణారావు శ్రీకాకుళంలో పండ్ల షాపు నడుపుతున్నారు. తల్లి రేణుక ఇళ్లలో పని చేసుకుంటూ కుమార్తెల్ని చదివిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు ఒకేలా 459 మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు. చార్మి, చాందినిలు ఇంజినీర్లుగా స్థిరపడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోనే మరో ఇద్దరు కవలలకు కూడా ఒకేలా మార్కులు వచ్చాయి. ఎల్‌ఎన్‌ పేట మండలం కోవిలానికి చెందిన శంభాన భరత్‌ చరణ్, భవ్యశ్రీలు కూడా కవలలు. వీరిద్దరు ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీలో 470 మార్కులకు 447 సాధించారు. ఇద్దరికీ ఒకేలా 447 మార్కులు వచ్చాయి. భరత్ చరణ్, భవ్యశ్రీలు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదువుతున్నారు. అటు చార్మి, చాందిని.. ఇటు భరత్ చరణ్, భవ్యశ్రీలు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారే కావటం విశేషం. అది కూడా టాప్‌ మార్కులు రావడంతో తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు.

తెలంగాణలోనూ అదరగొట్టిన కవలలు

తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో జగిత్యాలకు చెందిన సాయి వైభవ్, సాయి వర్షిత్‌లు కవలలు కాగా వారిద్దరూ ఒకేలా 451 మార్కులు సాధించారు. అలాగే మరికొందరు కవలలు టాప్ మార్క్‌లతో అదరగొట్టారు. ఈ కవలల మధ్య నాలుగైదు మార్కులు మాత్రమే తేడా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రామడుగు మండలం వెదిరకు చెందిన కవలలు కోరుకండ్ల పల్లవి 996, కోరుకండ్ల ప్రణీత 989 మార్కులు (ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో) సాధించారు. మేడిపల్లి మండలం కట్లకుంటకు చెందిన కవలలు పిల్లలు ఇంటర్‌ ఫస్టియర్ చదువుతున్నారు. వారిలో నేహాకు 467 మార్కులు, నిధికి 460 మార్కులు వచ్చాయి. కాల్వశ్రీరాంపూర్‌ ఆదర్శ పాఠశాలకు చెందిన కవలలు మర్రి అన్విత, అక్షితలు ఇంటర్ ఫస్టియర్‌‌లో 456, 455 మార్కులు సాధించారు. ఒకేసారి, ఒకే రూపంతో పుట్టి, ఒకేసారి ఎదిగిన కవలలు ఇప్పుడు పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు సాధించారు. అది కూడా మంచి మార్కులతో అదరగొట్టారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Intermediate Results
  • intermediate results
  • srikakulam
  • telangana

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

Chandrababu: 7వ విడత కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురువారం సచివాలయంలో ప్రారంభమైంది. రాష్ట్ర పాలనలో కీలకమైన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సదస్సు ప్రారంభంలో ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కించుకున్నందుకు ముఖ్యమంత్రికి మంత్రులు, అధికారులు స్టాండింగ్ ఓవ

  • Nara Lokesh

    Nara Lokesh: లోకేశ్ ఆసక్తికర ట్వీట్..

  • Ex Union Minister Maneka Gandhi Letter to Chandrababu Naidu

    చంద్రబాబుకు మేనకా గాంధీ లేఖ.. గంగమ్మ జాతరలో జంతు బలులు ఆపండి

  • Liquor Price

    Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

  • DRDO Aircraft Manufacturing Center in Andhra Pradesh

    DRDO: ఏపీలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ భారీ ప్రాజెక్ట్

Latest News

  • CM Vijay Thalapathy: సీఎం విజయ్‌ కి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్..!

  • Vijay TVK: ప్రభుత్వ ఏర్పాటుకు ఓకే చెప్పిన గవర్నర్

  • హైదరాబాద్ లో మరో మెట్రో ఫేజ్-3.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

  • Tamil Nadu Politics: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. గవర్నర్‌తో మరోసారి విజయ్ భేటీ

  • KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

Trending News

    • AIADMK: విజయ్ కు మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd