Yogandhra 2025 : విశాఖ తీరంలో మొదలైన ‘యోగాంధ్ర’ సందడి
Yogandhra 2025 : యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
- Author : Sudheer
Date : 19-06-2025 - 6:48 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో యోగా (Yoga) ప్రాధాన్యతను ప్రజల్లో పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘యోగాంధ్ర’ (Yogandhra ) కార్యక్రమం విశాఖపట్నం(Vizag)లో ఎంతో ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నగరంలోని అందమైన బీచ్ రోడ్డులో పెద్ద ఎత్తున వాకథాన్ నిర్వహించబడింది. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుందరమైన ప్రకృతి మధ్యలో జరిగిన ఈ వాకథాన్ ప్రజల దృష్టిని ఆకర్షించింది.
Iran-Israel: ఖొమేనీని వదిలిపెట్టబోం.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ప్రజల్లో యోగా మీద అవగాహన పెంచే ఉద్దేశంతో, ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు వాకథాన్ కొనసాగింది. మంత్రులు డీవీబీ స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్, సవితతో పాటు యోగా నోడల్ అధికారి కృష్ణబాబు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ వంటి ప్రముఖులు పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యోగా ప్రయోజనాలను సమాజానికి చేరువ చేయడంలో ఈ ప్రచార యాత్ర కీలకపాత్ర పోషించింది.
వాకథాన్ అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు, ప్రజలు కలిసి యోగాసనాలు చేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, దానిని ప్రతి ఒక్కరూ జీవన శైలిలో భాగం చేసుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు. ‘యోగాంధ్ర’ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆరోగ్యంపై చైతన్యం కలిగించేందుకు దోహదపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రజలలో యోగా పట్ల ఆసక్తిని పెంచడంలో విజయవంతంగా నిలిచింది.