HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >The Joy Of The Children In The Presence Of The Minister Of Education

Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

  • Author : Gopichand Date : 25-11-2025 - 3:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh
Nara Lokesh

Nara Lokesh: విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ‘విలువల విద్యా సదస్సు’ సందర్భంగా భావోద్వేగపూరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh), ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు తమ నిర్మలమైన సంతోషంతో అందరినీ ఆకట్టుకున్నారు.

మంత్రి నిర్మలమైన చిరునవ్వు

వెంకటాపురం ఎంపీపీఎస్‌కు చెందిన ముగ్గురు పసి విద్యార్థులు ధైర్యంగా మంత్రి వద్దకు చేరుకున్నారు. తమ డీఈఓ ప్రోత్సాహంతో ఎటువంటి భయం లేకుండా లోకేష్‌ని కలుసుకున్న పిల్లలు ఆయన అడిగిన ప్రశ్నకు తమ స్కూల్ పేరు, ఊరి పేరు స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా సరస్వతి విగ్రహం పూజ పూర్తయ్యే వరకు మంత్రి ముందు చాలా నిశ్శబ్దంగా, హుందాగా నిలబడటం అందరి దృష్టిని ఆకర్షించింది. స్కూల్‌కు బడి తోటను ఏర్పాటు చేయడంలో కృషి చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నంబూరి మనోజ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ముగ్గురు విద్యార్థులు చాగంటి కోటేశ్వరరావు ముందు మల్లెమాల పద్యం చెబుతామని బయలుదేరారని తెలిపారు.

Also Read: Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

‘బాల రైతులు’ ఇచ్చిన బడి తోట కానుక

దారి పొడవునా పిల్లలు “మేమ్ మన అరటి గెల, కూరగాయలు సార్‌కు ఇద్దాం. సార్ చాలా మంచోళ్ళు” అని చెబుతూ వచ్చారు. వారు గతంలో తాము పండించిన పంటను ట్వీట్ చేసినప్పుడు మంత్రి వారిని బాల రైతులుగా గుర్తించారో లేదో తెలియదు కానీ చిన్నారులు తెచ్చిన బడి తోట పంట కానుక మంత్రి మనసును గెలుచుకుంది.

ఉపాధ్యాయురాలు మనోజ మాట్లాడుతూ.. “తమ హోదాను చూపకుండా, మెత్తని మాట, నిర్మలమైన నవ్వుతో బిడ్డలను ఆప్యాయంగా హత్తుకున్న మంత్రివర్యులు మాకు దొరకడం మా అదృష్టం. ఆయన ఉపాధ్యాయుల కష్టాన్ని గుర్తిస్తున్న సహృదయులు. ఈ రోజు నాకు, పిల్లల తల్లిదండ్రులకు చాలా సంతోషంగా ఉంది” అని కృతజ్ఞతలు తెలియజేశారు.

మనోజ నంబూరి కృషికి అభినందనలు

వెంకటాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టీచర్ నంబూరి మనోజ కృషిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. “బడిని ప్రకృతి ఒడిగా తీర్చిదిద్ది, ఆకుపచ్చని కల సాకారం చేస్తున్న మనోజ నంబూరి కృషికి జేజేలు. ఏ పాఠశాలలో పనిచేసినా విద్యార్థులతో కలిసి తోట పెంపకం ఒక అలవాటుగా చేసుకున్న మనోజ అభినందనీయులు” అని కొనియాడారు. ప్రభుత్వం కిచెన్ గార్డెన్ కోసం ఇస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని, బడి తోటలో పండించిన కూరగాయలను, పండ్లను విద్యార్థులు పంచుకోవడం, మధ్యాహ్న భోజనంలో ఉపయోగించడం మంచి సంప్రదాయం అని మంత్రి పేర్కొన్నారు.

విలువల విద్యా సదస్సులో కీలక నిర్ణయాలు

విలువల విద్యా సదస్సులో విద్యాశాఖ మంత్రివర్యులు ప్రసంగిస్తూ సమాజంలో మార్పు తేవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక విలువల విద్యపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుని కేబినెట్ ర్యాంకుతో నియమించడం ఒక పవిత్రమైన బాధ్యత అని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Chaganti Koteswara Rao
  • nara lokesh
  • telugudesam party

Related News

AI Services In AP Government Hospitals

ఏపీలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవలు

Government Hospitals  ఏపీ ప్రభుత్వం ఏఐ సాయంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. 18 ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 40 పరికరాల ద్వారా పైలట్ ప్రాజెక్టు కింద సరికొత్త ఆవిష్కరణల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారు. ఈ మేరకు తక్కువ సమయంలో వ్యాధులు ఖరారు చేయడం, అత్యుత్తమ వైద్యం అందిచొచ్చని చెబుతున్నారు అధికారులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • ED Attaches Rs 441 Crore Assets in Andhra Pradesh Liquor Scam Case

    వైసీపీ మద్యం కుంభకోణంలో.. 441 కోట్ల ఆస్తులు ED అటాచ్

  • Girl Harassment

    వెబ్‌సిరీస్‌లో ఛాన్స్‌ పేరిట యువతితో అసభ్య వీడియోలు

  • Middle East War Effect

    యుద్ధం ఎఫెక్ట్: భారీగా పడిపోయిన కోడిగుడ్ల ధరలు..

  • Ap Logo

    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

Latest News

  • Sunstroke : వడదెబ్బతో చనిపోతే తెలంగాణ సర్కార్ రూ.4 లక్షల పరిహారం

  • Royal Stag Boom Box : రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్‌తో హోరెత్తిన విశాఖ తీరం

  • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

  • Myra : భారతీయ ప్రయాణికుల కోసం సరికొత్త టెక్నాలజీ

  • కొలెస్ట్రాల్ ఉందా? అయితే ఈ జ్యూస్ తాగండి!

Trending News

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

    • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

    • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో చ‌రిత్ర సృష్టించిన శాంస‌న్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd