HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Road Accident In Palnadu District Dachepalli Village

6 Killed : ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా

  • Author : Prasad Date : 18-05-2023 - 6:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున వ్య‌వ‌సాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురజాల డీఎస్పీ పళ్లం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని దామచర్ల మండలం నరసాపురం గ్రామం నుంచి గురజాల మండలం పులిపాడు గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం 23 మంది వ్యవసాయ కార్మికులు ఆటోలో వెళ్తున్నారని తెలిపారు. ఆటో పొందుగల వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు డీఎస్పీ తెలిపారు.. ఆటోను ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా తెలంగాణ వైపు వెళ్లాడని తెలిపారు.

మృతులను ఇస్లావతి మంజుల (25), భూక్య పద్మ (27), పాడియా సక్రి (35), భూక్య సోని (50), మాలావత్ కవిత (30)గా గుర్తించారు. బనావత్ పార్వతి(30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఆరుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని డీఎస్పీ పల్లం రాజు తెలిపారు. పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ రవిశంకర్ రెడ్డి గురజాలలోని జీజీహెచ్‌కు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీలైనంత త్వరగా పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పొందుగల వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు లక్షరూపాయ‌లు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురజాలలోని జీజీహెచ్‌ని మిర్యాలగూడ ఎమ్మెల్యే న‌లల్ల‌మోతు భాస్కరరావు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లు సందర్శించారు. మృతుల బంధువులను పరామర్శించి, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే భాస్కరరావు ఒక్కొక్కరికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి జానా రెడ్డి కోరారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. జానారెడ్డి కోరినట్లు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • dachepalli
  • palnadu
  • road accident
  • telangana

Related News

New Airports In Ap

New Airports in Telangana : జూన్ లో 2 ఎయిర్పోర్టులకు శంకుస్థాపన?

వరంగల్ చారిత్రక నగరానికి పర్యాటక రంగంలో కొత్త కళ రానుండగా, ఆదిలాబాద్ జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి విమాన సౌకర్యం ఒక వరంగా మారనుంది

  • Tg Assembly Session

    TG Assembly Session : నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

  • Physics Wala Vidyapeeth launched in Vijayawada

    Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

  • No shortage of cooking gas in Telangana: Uttam Kumar Reddy

    Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత

  • Son Writes Exam Hours After Father's Death

    గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!

Latest News

  • మీ గుండె ఆరోగ్యాన్ని పరీక్షించే సులభమైన మార్గం ఇదే!

  • ఊతకర్రల సాయంతో న‌డుస్తున్న టీమిండియా ప్లేయ‌ర్‌.. వీడియో ఇదే!

  • ఆర్‌సీబీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

  • అమరావతిలో అమర జీవికి అద్భుత నివాళి….!!

  • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

Trending News

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd