HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Road Accident In Palnadu District Dachepalli Village

6 Killed : ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా

  • Author : Prasad Date : 18-05-2023 - 6:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున వ్య‌వ‌సాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురజాల డీఎస్పీ పళ్లం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని దామచర్ల మండలం నరసాపురం గ్రామం నుంచి గురజాల మండలం పులిపాడు గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం 23 మంది వ్యవసాయ కార్మికులు ఆటోలో వెళ్తున్నారని తెలిపారు. ఆటో పొందుగల వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు డీఎస్పీ తెలిపారు.. ఆటోను ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా తెలంగాణ వైపు వెళ్లాడని తెలిపారు.

మృతులను ఇస్లావతి మంజుల (25), భూక్య పద్మ (27), పాడియా సక్రి (35), భూక్య సోని (50), మాలావత్ కవిత (30)గా గుర్తించారు. బనావత్ పార్వతి(30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఆరుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని డీఎస్పీ పల్లం రాజు తెలిపారు. పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ రవిశంకర్ రెడ్డి గురజాలలోని జీజీహెచ్‌కు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీలైనంత త్వరగా పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పొందుగల వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు లక్షరూపాయ‌లు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురజాలలోని జీజీహెచ్‌ని మిర్యాలగూడ ఎమ్మెల్యే న‌లల్ల‌మోతు భాస్కరరావు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లు సందర్శించారు. మృతుల బంధువులను పరామర్శించి, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే భాస్కరరావు ఒక్కొక్కరికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి జానా రెడ్డి కోరారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. జానారెడ్డి కోరినట్లు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • dachepalli
  • palnadu
  • road accident
  • telangana

Related News

Weightage for employees based on performance... CM Chandrababu new policy

వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉద్యోగుల్లో నూతనోత్సాహాన్ని నింపే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును ప్రమాణంగా తీసుకుని వారికి ప్రత్యేక వెయిటేజ్ ఇవ్వాలని, అత్యుత్తమంగా పనిచేసే సిబ్బందిని గుర్తించి ప్రభుత్వం తరఫున అభినందన లేఖలు అందజేయాలని ఆదేశించారు.

  • SBI Life opens three new branches in Telangana

    తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Adulterated milk incident.. Rs. 10 lakhs to the families of the deceased: CM Chandrababu

    కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు

  • Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

    రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

Latest News

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd