HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Road Accident In Palnadu District Dachepalli Village

6 Killed : ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా

  • Author : Prasad Date : 18-05-2023 - 6:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mexico Bus Crash
Road accident

ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లి మండ‌లం పొందుగ‌ల వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. తెల్లవారుజామున వ్య‌వ‌సాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురజాల డీఎస్పీ పళ్లం రాజు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని దామచర్ల మండలం నరసాపురం గ్రామం నుంచి గురజాల మండలం పులిపాడు గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం 23 మంది వ్యవసాయ కార్మికులు ఆటోలో వెళ్తున్నారని తెలిపారు. ఆటో పొందుగల వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మహిళా కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్లు డీఎస్పీ తెలిపారు.. ఆటోను ఢీకొట్టిన తర్వాత లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా తెలంగాణ వైపు వెళ్లాడని తెలిపారు.

మృతులను ఇస్లావతి మంజుల (25), భూక్య పద్మ (27), పాడియా సక్రి (35), భూక్య సోని (50), మాలావత్ కవిత (30)గా గుర్తించారు. బనావత్ పార్వతి(30) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఆరుగురు మహిళా కార్మికులు ప్రాణాలు కోల్పోయారని డీఎస్పీ పల్లం రాజు తెలిపారు. పల్నాడు పోలీస్ సూపరింటెండెంట్ రవిశంకర్ రెడ్డి గురజాలలోని జీజీహెచ్‌కు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీలైనంత త్వరగా పోస్టుమార్టం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పొందుగల వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురు మహిళా వ్యవసాయ కూలీలు మృతి చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు లక్షరూపాయ‌లు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గురజాలలోని జీజీహెచ్‌ని మిర్యాలగూడ ఎమ్మెల్యే న‌లల్ల‌మోతు భాస్కరరావు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్‌రెడ్డి, మాజీ మంత్రి కె. జానారెడ్డి, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్‌లు సందర్శించారు. మృతుల బంధువులను పరామర్శించి, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ఎమ్మెల్యే భాస్కరరావు ఒక్కొక్కరికి రూ.10వేలు ఆర్థికసాయం అందజేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి జానా రెడ్డి కోరారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కోరారు. జానారెడ్డి కోరినట్లు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • dachepalli
  • palnadu
  • road accident
  • telangana

Related News

Rising COVID-19 cases in AP

COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయతాండవం ఎవ్వరూ మరచిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షించగా, అవి RF 5

  • 9 arrested in Guntur case involving the stripping of a woman.

    Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

    Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • Farmers should not rush into paddy transplantation – Ministers issue a crucial warning to farmers.

    El Nino Effect: రైతులు తొందరపడి వరి నాట్లు వేయొద్దు.. రైతులకు మంత్రుల కీలక హెచ్చరిక

  • YouTuber Ravan's remand extended again.

    Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd